కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని బాబు ఎలా రద్దు చేస్తారు ప్రజలకి తెలియజేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం బాబుకి కొత్త కాదని అభిప్రాయ పడ్డారు. అసలు మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందే అనే జ్ఞానం కూడా చంద్రబాబు దగ్గర లేకపోవడం శోచనీయమని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం ప్రతిపాదిస్తేనే […]
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. ఒక వైపు అధికార వైసీపీ తాను చేసిన సంక్షేమం, అభివృద్దిని చూసి ఓటు వేయమని చెబుతోంది. అలాగే ప్రతి పక్ష నేతపై కూడా పదునైన పదజాలం ఉపయోగించకుండా తన 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఇలాంటి హామీలు అమలు చేశారా అని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం జగన్. అయితే టీడీపీ కూడా ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే సంక్షేమ పథకాలు అధికంగా ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ కి విచ్చేసిన నరేంద్ర మోడీ సమక్షంలో సోము వీర్రాజు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనుసరించిన ద్వంద్వ విధాలను సోము వీర్రాజు ఎండగట్టారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు వద్దన్నాడో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును సభలు పెడుతున్నాడని, ఎవ్వరైనా సరే వెళ్లి ప్రశ్నిస్తున్నారు? అంటూ నిలదీశారు. చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా […]
తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే...
రోజుకు మూడు బహిరంగ సభలతో తనకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. తాజాగా పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే..
ల్యాండ్ టైటలింగ్ చట్టం పై దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో భూములు అన్నీ సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు […]
ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎస్టేట్లో పవన్ కళ్యాణ్ ఒక మార్కెటింగ్ మేనేజరని ఎద్దేవా చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని కిర్లంపూడి గ్రామంలో తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా కుటుంబాన్ని బజార్ కి ఎక్కించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కి ఏమొచ్చిందని మండిపడ్డారు. కాగా పవన్ కళ్యాణ్ నిన్న తునిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ తాను రాబోవు ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం కుమార్తె అయిన క్రాంతికి సీట్ కేటాయిస్తానని చెప్పి ముద్రగడ పద్మనాభం […]
ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లను, స్ట్రాంగ్ రూములను స్వయంగా పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు . సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ […]
తమిళ నటుడు ధనుష్ వరుసగా తెలుగు దర్శకులకు అవకాశమిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ధనుష్, ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ధనుష్ తెలుగు దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు […]
గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ కు సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో భగ్గు మంటున్నాయి. ముద్రగడ పద్మనాభం వలన కాపులు తనకు దూరం అవుతున్నారు అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ముద్రగడ మీద వ్యక్తిగత విమర్శలతో పాటు ముద్రగడ కుటుంబాన్ని ప్రజల మధ్యకు తీసుకువచ్చి, ముద్రగడ పరువును తగ్గించేలా చేస్తున్నారు. ముద్రగడ కూతురు గాయత్రీ భర్త తనకు అభిమాని కావడంతో అతని సహకారంతో గాయత్రీ తో తన తండ్రీకి వ్యతిరేకంగా ఒక […]