తమిళ నటుడు ధనుష్ వరుసగా తెలుగు దర్శకులకు అవకాశమిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ధనుష్, ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ధనుష్ తెలుగు దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం చిత్రాన్ని తెరకెక్కించిన కిషోర్ కి ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు రాలేదు. కానీ హీరో ధనుష్ ని కలిసి కథ వినిపించగా కథ బాగా నచ్చిన ధనుష్ సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపినట్లు, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజే ఈ కాంబినేషన్ ని సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే కుబేర చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కీలకంగా ఉన్న ఓ సీన్ కోసం డంప్ యార్డ్లో నటించాల్సి ఉందట. దాంతో మూవీ టీమ్ డంప్ యార్డ్ను సెట్టింగ్స్తో క్రియేట్ చేయాలని అనుకున్నా, సీన్ సహజంగా రావడం కోసం డంప్ యార్డ్లోనే షూటింగ్ చేద్దామని, సుమారు 10 గంటల పాటు మాస్క్ లేకుండానే డంప్యార్డ్లో ధనుష్ నటించారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.