తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే...
ఎన్నికలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా సీఎం జగన్ నిర్వహిస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే…
రేపల్లె సిద్ధమా? ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ప్రేమానారాగాలు, ఇంతటి ఆప్యాయాతలు, ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా ప్రతిఅక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ… మీ అందరి ప్రేమాభిమానాలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు,పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.
మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. అందరూ గుర్తుపెట్టుకొండి.. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు.ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే.ఈ ఎన్నికల్లో ఎవరైనా మళ్లీ చంద్రబాబును నమ్మడం అంటే దానర్ధం… మళ్లీ మోసపోవడం. దానర్ధం మళ్లీ చంద్రముఖిని నిద్రలేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే… కొండ చిలువ నోట్లో తలకాయపెట్టడమే అన్నది ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకొండి. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్ధం.
దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గత చరిత్రను మారుస్తూ..నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతున్నాయి. ఎటువంటి వివక్ష, లంచాలు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. గతంలోఎప్పుడైనా ఇలాంటి పథకాలను కానీ, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం కానీ ఎప్పుడైనా చూశారా? ఏకంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం వాగ్ధానాలు అమలు చేసినది ఈ 59 నెలల పాలనలోనే రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగాయి.
ఇప్పుడు గడగడా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను. మీరే ఆలోచన చేయండి. మీ బిడ్డ చెబుతున్న పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా చూశామా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిషు మీడియం, ఆరోతరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధన, 8వతరగతికి పిల్లాడు వచ్చేసరికి వారి చేతుల్లో ట్యాబులు, ఇంగ్లిషు మీడియంతో మొదలుపెడితే టోఫెల్ ఐబీ వరకు ప్రయాణం… గవర్నమెంటు బడి పిల్లల చేతుల్లో మొట్టమొదటసారిగా బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషులో అందుబాటులోకి తేవడం, బడులు తెరిచే సరికి ఓ విద్యాకానుక, ఓ గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ… రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మఒడి అనే పథకం.. పెద్ద చదువులకు ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన.. ఇప్పుడు నేను చెప్పిన చదువుల రంగంలో విప్లవాన్ని తీసుకొస్తున్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
వాళ్లకు తోడుగా ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం..ఈ అక్కచెల్లెమ్మల పేరిటే 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ తో పాటు అందులో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల స్వావలంభన కోసం, వారి సాధికారత కోసం ఇన్ని పథకాలతో తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడునా ఉందా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్ కానుక. ఇంటివద్దకే పౌరసేవలు, పథకాలు, ఇంటివద్దకే రేషన్ ఈ మాదిరిగా ఇంటివద్దకే వచ్చే పాలన కానీ గతంలో ఎప్పుడైనా చూశారా? రైతన్నలకు పెట్టుబడి సహాయంలో ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా రైతన్నకు నష్టం జరిగితే ఇన్ పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటలకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్ధ ఈ మాదిరిగా రైతన్నను పట్టించుకుని అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా?
స్వయం ఉపాధికి తోడుగా, అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, చిరువ్యాపారులకు, శ్రమజీవులకు అండగా తోడు, చేదోడు పథకాలు, మత్స్స్యకారులకు మత్స్యకార భరోరా, లాయర్లుకు లా నేస్తం.. ఇలా స్వయం ఉపాధిరంగానికి ఈ మాదిరిగా ఇన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఏ పేదవాడూ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా రూ.25లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, , పేదవాడికి అండగా ఆరోగ్యఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే వచ్చే ఆరోగ్యసురక్ష ఈ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉంటూ.. పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?
వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా..ఏ గ్రామంలో చూసినా ఏకంగా 600 రకాల సేవలందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్ధ.. ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చేయిపట్టుకుని నడిపిస్తూ… ఇంటికే అందిస్తున్న సేవలు. అదే గ్రామంలో ఓ నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బేకే వ్యవస్ధ. అదే గ్రామంలో ఆర్బీకే వ్యవస్ధ పక్కనే విలేజ్ క్లినిక్ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లిషు మీడియం స్కూల్. గ్రామంలోనే పైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీసు, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?
అటువైపు చంద్రబాబును చూడండి. 14 యేళ్ల పాటు 3 సార్లు సీఎంగా చేశానని ఆ పెద్దమనిషి చెబుతాడు. నేను ఇక్కడున్న వేలాదిమంది నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను అడుగుతున్నాను. 14 యేళ్లు సీఎంగా చేసిన ఆ చంద్రబాబు పేరు చెబితే.. ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు వస్తుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న ఈ పెద్దమనిషి పేరు చెబితే.. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా ?అని అడుగుతున్నాను. మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తన పేరు చెబితే ఏ పేదవాడికీ కూడా ఆ మనిషి వల్ల నాకు మంచి జరిగింది, ఆయన పాలనలో నాకు ఈ స్కీం అందింది అనిచెప్పుకునే పరిస్థితి లేని పాలకుడు చంద్రబాబునాయుడని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.