సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అన్ని వర్గాలు స్వాగతించాయి. వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెప్పిందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ మేనిఫెస్టోపై స్పందించారు. వైఎస్సార్సీపీ విధానాలు సంస్కరణల దిశగా ఉన్నాయి. ప్రజలను కష్టాల నుంచి బయట పడేయడం జగన్కే సాధ్యం. విశాఖపట్నంను క్యాపిటల్ సిటీగా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతోపాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా స్పందించారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటమి భయంతో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడితో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తూ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నాడు. పూర్తి బాధ్యతలను తన అన్న నాగబాబుకు అప్పగించాడు. పిఠాపురంలో కొద్దిరోజులుగా మెగా మిడిల్ బ్రదర్ ఓవర్షాన్ ఎక్కువైపోయింది. నోటికి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. స్థానికంగా అంశాలపై అవగాహన లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్పై బురద వేయాలని చూస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన డబ్బు, డొనేషన్ల రూపంలో […]
నవరత్న పథకాలను కొనసాగిస్తూ అమలుకు సాధ్యం కాదన్న మాటే లేకుండా ఎలాంటి అసత్య హామీలను ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 ను విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే… ఈ సారి కూడా మనది కేవలం రెండు పేజీల మేనిఫెస్టో. మన మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఈసారి కూడా మన […]
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్న సూపర్ 6 లాంటి హామీలు అమలు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్ ని మించి భారీగా నిధులు కావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో తెలిపారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు పాలనతో తన పాలన పోలుస్తూ స్లైడ్స్ వేశారు. అమలు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సూపర్ 6 లకు సూపర్ 10 లకు ఎంత ఖర్చు అవుతుంది. సాధ్యమేనా… 2014 […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం దానిని నెరవేర్చకుండా కుంటిసాకులు చెప్పడం పరిపాటే. ఎన్నికల తాయిలాలు ప్రకటించి ప్రజలను మోసం చేయడం. ప్రశ్నించిన వారినే దబాయించి మాట్లాడటం 5ఏళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలందరూ కూడా చూసారు. అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చే సరికి సరికొత్త మోసాలతో వచ్చే బాబు ఈసారి సూపర్ సిక్స్ పేరుతో మిని మ్యానిఫెస్టోని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాటిని నేరవేరుస్తాం అంటూ ప్రజలని మభ్య […]
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తనకు ప్రాణహానీ ఉంది పోలీసులు రక్షణ కల్పించాలని పోలీసులకి ఫిర్యాదు చేసాడు. గతంలో సీబిఐ జాయింట్ డైరెక్టర్ గా తాను పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేశానని ఇందులో భాగంగా కొందరు నుంచి తనకు ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ను కలిసి ఫిర్యాదును అందజేశారు. నేను సీబీఐ […]
‘నా ప్రభుత్వంలో రైతే రాజుగా ఉంటాడు. వ్యవసాయాన్ని పండగ చేస్తా’ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటివి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. కొర్రీలు పెట్టి చంద్రబాబు నాయుడు వేధించాడు. జగన్ ప్రభుత్వం ఐళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చు చేసింది. […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజా క్షేత్రంలోకి వస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శనివారం ప్రకటించారు. ఆదివారం జగన్ రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో వైఎస్సార్ సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో […]
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన నారా చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరీ భూతుల ఆడియొ నిజమే అని తేలిపోయింది. తెలుగుదేశం వారు ప్రచారం చేస్తునట్టు అది డీఫ్ ఫేకో , మార్ఫో కాదని ఆమే మాట్లాడిన ఓరిజినల్ ఆడియోనే అని డిల్లీకి చెందిన మిస్ ఇంఫర్మేషన్ అలియన్స్ అనే సంస్థ పలు ఎనాలసిస్ల తరువాత తేల్చేసింది. ఇంకా ఆ సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఆడియో […]
జగన్ పాలనపై సంక్షేమం ఫలాలపై వేలెత్తి చూపే ఆస్కారంలేని ప్రతిపక్షాలు నిత్యం ఆయనపై చేసే దాడుల్లో అతి ముఖ్యమైనది మతపరమైన దాడి. కుట్రలకి కుతంత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన తెలుగుదేశం పార్టీ ఏదొక సమస్యను సృష్టించి దాన్నే ఒక ఇష్యుగా లేవనెత్తి జగన్ కి అంటగట్టి రాజకీయం చేయడం పరిపటిగా మారింది. రెండు రోజులనాడు కూడా నెల్లిమర్లలో రామతీర్ధం రాములవారిపై దాడి అంటూ చంద్రబాబు చేసిన మతరాజకీయం విదితమే. అయితే ఇదే చంద్రబాబుకి దేవుని పై […]