ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అప్పటి సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరూ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రాయలసీమ జిల్లాలో బాబు, నల్లారి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడారు. శనివారం నెల్లూరులోని 8వ డివిజన్లో ప్రచారం చేసిన విజయసాయిరెడ్డి మాజీ సీఎంల వ్యాఖ్యలపై స్పందించారు.
కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబు కలిసి తమ స్వార్థం కోసం రాష్ట్ర విభజనకు సహకరించారు. అప్పట్లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కిరణ్ సహకరించి దుష్టశక్తిగా నిలిచాడు. విభజన సమయంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం ఉండేది. ఈ∙విషయాన్ని అప్పటి అడ్వకేట్ జనరల్ వెల్లడించినా కిరణ్కుమార్రెడ్డి తన పదవిని మరో ఆరు నెలలు నిలబెట్టుకునేందుకు రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడాడు. దీనిని అందరూ చూశాను. ఈయనకు రాజకీయంగా ఎలాంటి సిద్ధాంతాలు లేవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో తిరిగాడు. నేడు బీజేపీతో కలవడం ఎంత వరక సమంజసం. నాడు కాంగ్రెస్తో కలిసి విభజనకు సహకరించిన టీడీపీ అధ్యక్షుడు.. అప్పటి సీఎం కిరణ్ ఇప్పుడు బీజేపీతో కలవడం సిగ్గుచేటు. అధికారమే పరమావధిగా రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని బాబును ప్రజలు తమ ఓటుతో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొనేలా చేయాలి. విజయసాయిరెడ్డి వెంట సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, నాయకులు ఉన్నారు.