2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యి, ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పైన స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయింపు పూర్తి జరిగిపోయి రిటర్నింగ్ ఆఫీసర్లు బ్యాలెట్ పేపర్లో ప్రింటింగ్ కోసం పంపించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఎన్నికల్లో రెండో దశ అయిన ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. 80 సంవత్సరాలు దాటి బెడ్ కే పరిమితమైన ముసలివారికి ఇంటి నుంచే ఓటు హక్కు వేసే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అందుకోసం ఇంటి నుంచి ఓటు వేయాలనుకునే 80 సంవత్సరాలు పైబడిన వారు అలా ఓటు వేయడానికి తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ ముగిసి ఈరోజు నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.తెలంగాణ వారికి రేపటి నుంచి అవకాశం కల్పిస్తాం అని ఇప్పటికే ప్రకటించింది. ప్రయోగాత్మకంగా ఓటింగ్ నిర్వహించాల్సిన ప్రదేశాలలో ఇప్పటికే బ్యాలెట్ ప్రింటింగ్ పూర్తి అయ్యి ఓటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. పూర్తిగా రాష్ట్రస్థాయిలో రెండు, మూడు రోజుల్లో బ్యాలెట్ పత్రాలు ప్రింటింగ్ పూర్తి చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియకి నమోదు చేసుకున్న వారికి ఓటు వేయడానికి ప్రత్యేక టీంలను ఇంటికే పంపిస్తామని ప్రకటించారు.ప్రింటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్నికల విధులు నిర్వహించబోయే ప్రభుత్వ అధికారులు ఓటింగ్ అవకాశం కల్పిస్తామని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం 4 మండలాలకు 407 ఓట్లకు 21 ప్రత్యేకమైన టీంలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. హోమ్ ఓటింగ్ ప్రయోగాత్మకంగా మొదలుపెట్టడంతో అన్నిచోట్ల సక్సెస్ చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని పరిశీలన కోసం తూర్పుగోదావరి జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ పలుచోట్ల ఓటింగ్ ప్రక్రియను గమనించారు. తెలంగాణ రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ రేపు మొదలు కానుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో హోమ్ ఓటింగ్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.