నవరత్న పథకాలను కొనసాగిస్తూ అమలుకు సాధ్యం కాదన్న మాటే లేకుండా ఎలాంటి అసత్య హామీలను ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 ను విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే…
ఈ సారి కూడా మనది కేవలం రెండు పేజీల మేనిఫెస్టో. మన మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో. ఇంతకు ముందు ఇదీ మన మేనిఫెస్టో. ఇప్పుడు ఇదీ మన మేనిఫెస్టో(మేనిఫెస్టోలు చూపిస్తూ). ఈ మాదిరిగా.. మన మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించినవి గమనిస్తే, ముఖ్యమైన అంశాలు పైన చెబుతాను. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, డిజిటల్ బోధన.
వైద్యం.. విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ. ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం.. రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య.. జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్ గా కరిక్యులమ్ లో మార్పులు. నాడు నేడు.. స్కూల్లు, నాడునేడు ఆస్పత్రులు. పేదలందరికీ ఇళ్లు, అక్కచెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు. మహిళా సాధికారత.. చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ. సామాజిక భద్రత.. పెన్షన్ కానుక 2 విడతల్లో రూ.3,500కు పెంపు. ఎప్పటిలాగే ఇంటివద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన.. ప్రస్తుతం నిర్మిస్తున్న 4 పోర్టులు పూర్తి చేస్తాం, ఫిషింగ్ హార్బర్ల పూర్తి, ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ పూర్తి, ఇండస్ట్రియల్ కారిడార్లు పూర్తి, నోడ్స్ పూర్తి, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం పూర్తి, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ. ఇదీ మేనిఫెస్టోకి సంబంధించిన సమ్మరీ అని సీఎం జగన్ వెల్లడించారు.