2019 లో వైసీపీ నుండీ నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచిన రఘు రామ కృష్ణరాజు తర్వాత కొద్ది కాలానికే వ్యక్తిగత కారణాలతో వైసీపీతో విభేధించి టీడీపీతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే, ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో టీడీపీ తరుపున నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని రఘురామ పెట్టుకొన్న ఆశల పై చంద్రబాబు నీళ్లు చల్లాడు, పొత్తులో భాగంగా ఆ సీటుని బిజెపికి కేటాయించడంతో బిజెపిలో చేరి అయినా పోటీ చేద్దామానుకొంటే బీజేపీ పార్టీ తనని చేర్చుకోకుండా దీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకొన్న శ్రీనివాస వర్మకి నరసాపురం సీట్ ఇచ్చింది.
అలా ఎన్డీఏ కూటమిలో ఏదొక పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ రఘురామ కృష్ణరాజు కూటమి టికెట్ ప్రకటన తర్వాత బిజెపి టిడిపి పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే, మళ్లీ అంతలోనే కూటమిలో సీటు తనకి ఇస్తారంటూ మీడియాతో తెలిపారు.
నరసాపురం సీటును టీడీపీ నుంచి పొత్తులో భాగంగా తన కోసం తీసుకుని ఇవ్వకపోవడంపై బీజేపీని టార్గెట్ చేసిన రఘురామ కృష్ణరాజు ఆ తర్వాత చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలకు దిగారు. దీంతో రఘురామకు దారులన్నీ మూసుకుపోయినట్లేనని భావిస్తున్న వేళ ఇవాళ సంచలన కామెంట్స్ చేసారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నుండి నర్సాపురం పార్లమెంటుకు పోటీలో ఉంటానని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తనకు కచ్చితంగా ఎన్డీఏ కూటమి తరపున న్యాయం చేస్తారని తెలిపారు.రెండు మూడు రోజుల్లోగా ఎన్డీఏ కూటమి నుండి నిర్ణయం వెలువడుతుందని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ బరిలో అయితే ఉండటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి తరపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయలనేది ప్రజల కోరిక అని రఘురామ చెప్పుకొచ్చారు.