ఐపీఎల్ 2024 లో భాగంగా ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది, ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీస్కోర్ చేసింది, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరో సారి తనదైన క్లాస్ షాట్స్ కి తోడు మెరుపులు మెరిపించాడు కేవలం 47 బంతుల్లో 92 పరుగులు ( 7 ఫోర్లు , 6 సిక్సులు ) లతో చేలరేగి ఆడాడు , కోహ్లీకి తోడు కామెరూన్ గ్రీన్ (46 పరుగులు ), రజత్ పాటిదార్ (55 పరుగులు ) దూకుడు బ్యాటింగ్ తో ఆ జట్టు పంజాబ్ కింగ్స్ కి 242 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది
పంజాబ్ బౌలర్లలలో హర్షల్ పటేల్ 3 వికెట్లు , కావేరప్ప 2 వికెట్లు అర్హదీప్ సింగ్, శామ్ కర్రన్ చెరో వికెట్ పడగొట్టారు
అనంతరం భారీ లక్ష్య చేధనకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆదిలోనే ఓపెనర్ ప్రభుమాన్ సింగి వికెట్ కోల్పోయింది అయితే తరువాత వచ్చిన రసోల్ మరోక ఓపెనర్ బెయిరెస్టోతో కలిసి అధ్బుతమైన బ్యాటింగ్ ఆడారు, రసోల్ 27 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటవ్వగా బెయిరెస్టో 27 పరుగులకు వెనుదిరిగాడు , తరువాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా నిలదొక్కుకోలేదు , శశాంక్ సింగ్ (37 పరుగులు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసి కోహ్లీ అధ్బుతమైన ఫీల్డింగ్ తో రనౌట్ అవుట్ అయ్యారు. దీంతో పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలలో 181 పరుగులకు ఆలౌట్ అయ్యింది , ఈ ఓటమితో పంజాబ్ ఐపీఎల్ 2024 టోర్నీ నుంచి నిష్క్రమించింది
ఆర్సీబీ బౌలర్లలలో సిరాజ్ 3 వికెట్లు, స్వప్నిల్ సింగ్ , ఫెర్గుసన్ , కరణ్ శర్మ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు
సెంచెరీ మిస్ చేసుకు్న్నా అధ్బుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ , అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా హర్శల్ పటేల్ కొనసాగుతున్నారు