నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో నగదు అందించడం పై త్వరితగతిన విచారణ చేపట్టి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నియమావళి అమలు లోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఆగడాలు ఆగడం లేదు, మాకు నియమావళికి సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మొదటి రోజే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్ట్లు పెట్టిన ఎన్నికల కమిషన్ చేత మొట్టికాయలు వేయించుకున్నారు. అది జరిగిన రెండు రోజులకే ఉమ్మడి పొత్తులో భాగంగా నిర్వహించిన ప్రజగళం సభ ఫెయిల్ కావడంతో ఆ నిందను పోలీస్ డిపార్ట్మెంట్ పైకి నెట్టడానికి ప్రయత్నించింది, ఆ సందర్భంలో కూడా ఎన్నికల కమిషన్ చివాట్లు పెట్టీ పంపింది,
అంతలోనే మళ్ళీ నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ఈ నెల 20న అన్నమయ్య జిల్లా రాయచోటిలో యాత్రను నిర్వహించి నగదు పంపిణీ చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం నగదు విరాళం ఇవ్వటానికి ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అది చేయకుండానే నిజం గెలవాలి యాత్ర లో నగదు అందించారు.నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో నిర్వహిస్తున్న యాత్ర సందర్భంగా నగదు అందించడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధం అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ కి ఈ నెల 21 వ తేదీన ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ ఫిర్యాదు మీద అన్నమయ్య జిల్లా కలెక్టర్ విచారణను ప్రారంభించారు.