రాష్ట్రంలో నిన్నటి రోజున వాడి వేడిగా సాగిన ఎన్నికలు ముగిసిన తరువాత నేడు తొలిసారి జగన్ తన సందేశాన్ని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించడానికి సునామీలా వచ్చిన ఓటర్లకు పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత.
ఎన్నికల నిర్వహణకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అడుగడుగునా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఆ క్రమంలోనే కోటము ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ ఆగడాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనితో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా టిడిపి శ్రేణుల్లో అలజడి మొదలైంది.
తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే...
‘దగ్గుబాటి పురందేశ్వరి నా భార్య సోదరి కదా.. తెలుగుదేశానికి మంచి చేస్తుందిలేనని పూర్తిగా నమ్మాను. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయాం’ రెండు రోజుల క్రితం తనను కలిసిన సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. మొన్నటి వరకు పొత్తు కుదర్చాలని బతిమిలాడుకున్న బాబు ఇప్పుడు ఆమె పేరు ఎత్తితేనే కోప్పడుతున్నాడని సమాచారం. కమలం పెద్దలు చంద్రబాబు గ్యాంగ్కు హ్యాండ్ ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ నెల మధ్యలో ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చి […]
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఎల్లో గ్యాంగ్ చిన్నచూపు చూస్తూనే ఉంది. వారు తమవారు కాదని అవమానిస్తూనే ఉంది. సోమవారం రాత్రి నందమూరి బాలకృష్ణ చిత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ప్రసంగానికి ముందు జూనియర్ అభిమానులు తమ హీరో చిత్రం ఉన్న జెండాలను ఊపారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హీరోకు అనుకూలంగా నినాదాలు చేశారు. నందమూరి వంశమంతా ఒకటే అనే భావనలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ‘నా […]
‘నిజాయతీకి ప్యాంట్, షర్ట్ వేస్తే అది నేనే. నాఅంత మంచి మనిషి ఉండడు. నా అంత నీతిమంతుడిని మీరు చూసి ఉండరు’ సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పే ఈ మాటలు విని తెలుగు తమ్ముళ్లే నవ్వుతుంటారు. ఎందుకంటే బూతద్దం పెట్టి వెతికినా బాబులో నిజాయతీ అనేది అణువంత కూడా కనిపించదు. ఏప్రిల్ 30వ తేదీని హానెస్ట్ డేగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా నారా వారి నిజాయతీని ఎంత చర్చించినా తక్కువే అవుతుంది. బాబు దృష్టిలో […]
ఎన్నికల వేల టీడీపీ ధన ప్రవాహనికి తెర లేపింది, ఓటుకి నోటుకి ఆధ్యుడైన చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా నేడు టీడీపీ అనంతపురం జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఎన్నికల పెర్మిషన్ పొందిన వాహనంలో రెండు కోట్ల రూపాయల నగదు పోలీసులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే అనంతపూర్ జిల్లా అనంతపురం నగరంలో విద్యుత్ నగర్ సర్కిల్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు నేతల్ని ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆయనకు వారిని విమర్శించే అర్హత లేదని అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ని ఎన్నికల్లో ఓడించకపోతే నా పేరుని ముద్రగడ […]
మైలవరం నియోజకవర్గంలో ఓటమి భయంతో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేస్తున్న దాడులతో నియోజకవర్గం మొత్తం అట్టుడికి పోతున్నది. రెండూ రోజుల క్రితమే ముస్లింల మీద అందులో ముస్లిం మహిళల మీద దాడి చేసిన సంఘటన మరువక ముందే ఇబ్రహీంపట్నం లోని కొటికలపూడి గ్రామంలో మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనుచరులు వీరంగం సృష్టించారు. ప్రచారంలో దళితుల ఇళ్ల పై దాడులు చేసిన సంఘటనలో ముగ్గురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. తరువాత దళితులకు అండగా గ్రామ […]