బీజేపీ పెద్దలను కలిసి పొత్తుపై ఒప్పించుటకై ఢిల్లీ వెళ్లిన బాబు, ఢిల్లీ బయలుదేరే ముందు బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కలసినట్లు సమాచారం.చంద్రబాబు శిష్యుడు, తన కోసమే ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు నోటు ఇవ్వబోతూ దొరికిన రేవంత్, తన గురువు అయిన బాబు కోసం ఓ పెద్ద కార్యానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం..
బీజేపీ తో టీడీపీ పొత్తు కు బీజేపీ ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ససేమిరా అంటున్న నేపథ్యంలో చివరి అస్త్రం గా తెలంగాణ లో అధికారం బీజేపీ చేతిలో పెట్టడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం..ఏపీ లో టీడీపీ తో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించి తమకు పూర్తి సహాయసాకారాలు అందిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాతా తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రేవంత్ అంగీకరించాడని సమాచారం.
ముందు నుండీ ఆరెస్సెస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడిగా సంఘ్ లో మంచి పరిచయాలు ఉన్న రేవంత్ కు బీజేపీ భావజాలం దగ్గరగానే ఉంటుంది. ఒకవేళ ఏపీ లో బీజేపీ టీడీపీ పొత్తు పొడిస్తే ఎన్నికల అనంతరం రేవంత్ తన కోటరీ ఎమ్మెల్యే లతో బీజేపీ లో జాయిన్ అయ్యేలా, మెజారిటీ కి అవసరం అయ్యే ఇంకొంతమంది ఎమ్మెల్యే లను, కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ నుండి బిజెపి తమవైపుకు లాక్కునేలా, ప్రణాళిక రచించి బీజేపీ సీఎం అభ్యర్థిగా రేవంత్ ని ప్రకటించేలా ఒప్పందానికి రావొచ్చు అని, దాని ద్వారా బాబుకు, బాబు శిష్యుడైన రేవంత్ కు మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుందని వారి మధ్య ఒప్పందం కుదిరినట్లు దీనిని వివరించేందుకు బాబు ఢిల్లీ పెద్దలను కలవనున్నట్లు సమాచారం..
ఈ నేపథ్యంలో బాబు ఢిల్లీలో తిష్ట వేయగా మరోవైపు ఎంపీ టికెట్ లను నిర్ణయించడానికి సోనియా గాంధీ ని, ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ కూడా అవసరం అయితే రహస్యంగా బీజేపీ పెద్దలను కలిసి తన మాటగా కూడా హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది…