తెలంగాణ రాష్ట్రంలో, నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్స్, డాక్టర్స్, కానిస్టేబుల్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్వాగత సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం ఫై తనకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఇంగ్లీష్ రాదు అని చాలామంది వెక్కిరిస్తున్నారని సభలో చెప్పుకొచ్చారు. అయితే తాము చదువుకునే రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బట్టి విద్యా ప్రమాణాలను బట్టి ఇంగ్లీష్ మీడియం చదువుల […]
ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కావడంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ను ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు […]
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. తాజాగా ఆమెకు మధ్యంతర బెయిల్ను నిరాకరిస్తూ నేటి ఉదయం తీర్పు వెలువరించింది. కాగా తన కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా ఆమె కుమారుడికి ఇప్పటికే పరీక్షలు పూర్తయినందున బెయిల్ మంజూరు […]
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను బెంబేలిత్తుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేడిగాలులు వీస్తుండడంతో పాటు ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. కర్నూలు 42, తిరుపతి 41, నెల్లూరు, విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా విశాఖ జిల్లాలో ఎండలు […]
టీవీ5 యాంకర్ సాంబశివరావు చూసేందుకు అమాయకుడిలా కనిపిస్తాడు. నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుంటాడు. నీతులు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ చేసే పనులు చూస్తే ఔరా సాంబా అనాల్సిందే. ఈ పచ్చ యాంకర్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నాడు. అక్రమార్జన కోసం ఎన్నో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతడిపై పోలీసులకు […]
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టు చట్ట విరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టు […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలలో బరిలోకి దిగేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించిన తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు వీలుగా ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి తమిళిసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం […]
తెలంగాణాలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ని అంతగా బలం లేని పార్టీగా చెప్పుకోవచ్చు. గత ఏడాది తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో 108 స్థానాల్లో పోటీకి దిగిన బీఎస్పీ అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి, కేవలం 1.08% ఓటు షేరును మాత్రమే సాధించగలిగింది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలోని నాగర్ర్నూల్తో […]
బీజేపీ పెద్దలను కలిసి పొత్తుపై ఒప్పించుటకై ఢిల్లీ వెళ్లిన బాబు, ఢిల్లీ బయలుదేరే ముందు బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కలసినట్లు సమాచారం.చంద్రబాబు శిష్యుడు, తన కోసమే ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు నోటు ఇవ్వబోతూ దొరికిన రేవంత్, తన గురువు అయిన బాబు కోసం ఓ పెద్ద కార్యానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.. బీజేపీ తో టీడీపీ పొత్తు కు బీజేపీ ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ససేమిరా […]
రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సాయి కుమారి అనే మహిళ ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తులోని కాల్సెంటర్లో పనిచేస్తుంది. కాగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆమె కావాలని ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు పలువురిలో తలెత్తుతున్నాయి. యాజమాన్యం వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే ఆమె […]