ఆంధ్ర ప్రదేశ్ లోఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం కష్టమేనని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు అశేష జనాధారణ పొందడమే దీనికి సంకేతంగా చెప్పవచ్చని ప్రతిపక్ష పార్టీ నాయకులు అనుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష […]
విజయవాడలో నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులకు తన నివాసంలో బి ఫామ్ లు అందజేశాడు. టీడీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు అందరికీ ఆహ్వానం పంపించారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవింద్ బాబు కూడా బీఫామ్ తీసుకోవడానికి విజయవాడకి వచ్చారు. కానీ ఆయనకు బి ఫామ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు అరవింద్ కు టికెట్ ఇవ్వకుండా చాలా […]
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ జంగా కృష్ణమూర్తి.. 1999 లో మొదటిసారి ఎమ్మెల్యే గా గురజాల నియోజకవర్గం నుండి గెలిపొందిన ఆయన, 2004 లో మరోసారి ఎన్నికయ్యారు. కాగా 2009 లో కాంగ్రెస్ నుండి, 2014 లో వైసీపీ నుండి వరసగా రెండుసార్లు ఓటమిపాలయ్యాడు.. 2014 లో ఓటమి చెందినా జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఎంఎల్సీ ఇచ్చి, వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించి ఆయనకు తగిన గౌరవం ఇచ్చాడు.. […]
వైస్సార్సీపీ అధినేత జగన్ నర్సరావు పేట ఎంపీ టికెట్ బీసీ లకు ఇవ్వాలని తలచి ప్రస్తుత ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలను గుంటూరు నుండి పోటీ చేయమని కోరగా అలిగి వైసీపీ ని వీడి టీడీపీ లో జాయిన్ అయిన లావు పల్నాడు పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా తన సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లా మొత్తం మీద ఒక్క బీసీ అభ్యర్థిని కూడా టీడీపీ తరపున పోటీ చేయకుండా నిలవరించే ప్రయత్నం […]
డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్.. మొన్నటి వరకు నెల్లూరు సిటీలో తన మార్క్ని చూపించారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నరసారావుపేట పార్లమెంట్ ఇన్చార్జిగా తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు. సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమోషన్ ఇచ్చి నరసారావుపేట పార్లమెంట్కు పంపారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు, అధికారులను సమన్వయం చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. గత ఐదేళ్ల కాలంలో ప్రారంభించిన పనులు.. అవి […]
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏదైనా చేస్తా. జగనన్నకు నా ఉపయోగం ఏ ఊరిలో ఉంటే అక్కడికి వెళ్తా. ఎంపీగా పోటీ చేయాలన్నారు. సరేనన్నాను. ఆయన మాటకు అడ్డు చెప్పే ప్రసక్తే లేదు’ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలివి. జగన్ ఆయన్ను నరసారావుపేట పార్లమెంట్ ఇన్చార్జిగా నియమించిన విషయం తెలిసిందే. నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ను సిటీకి సమన్వయకర్తగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనిల్ […]
‘నేను ఎమ్మెల్యే, మంత్రి కావడానికి కారణం జగనన్న. ఆయన మాటే నాకు వేదం. అధినేత గీత గీస్తే దాటను. వచ్చే ఎంపీ ఎన్నికల్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు నాకు కావాలి’ అంటూ నరసారావుపేట పార్లమెంట్ స్థానంలో కొద్దిరోజులుగా నెలకొన్న సస్పెన్స్కు నెల్లూరు సిటీ శాసనసభ్యుడు డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ తెరదించారు. తానే అభ్యర్థినని చెప్పకనే చెప్పారు. పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాడమే ఇక మిగిలింది. నెల్లూరు రూరల్లో జన్మించిన అనిల్ చెన్నైలో వైద్య విద్యనభ్యసించారు. 2008లో […]
గత రెండేళ్లుగా నరసరావుపేట అసెంబ్లీ స్థాన టీడీపీ ఇంచార్జ్ పదవికి జరుగుతున్న మూడు ముక్కలాట గత నెల రోజుల్లో అయిదు ముక్కలాట కాగా, గడిచిన రెండు రోజుల్లో మరో ముక్క చేరింది. ఆ ముక్క పేరే జంగా కృష్ణమూర్తి. 2019 లో టీడీపీ తరుపున పేట నుండి పోటీ చేసి ఓడిపోయిన అరవింద బాబు నాటి నుండి టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండగా, దీర్ఘ కాలంగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ కడియాల వెంకటేశ్వర రావు కుటుంబం […]
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ టికెట్ పోరు తారాస్థాయికి చేరిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునని అనిపించక మానదు? . టీడీపీ ఆవిర్భావం నుండి 1999 వరకూ నరసరావుపేట టీడీపీకి పెట్టని కోటగా నిలిచింది. 1983 టీడీపీ ఆవిర్భావం నుండీ 99 వరకూ జరిగిన అయిదు శాసనసభ ఎన్నికల్లో వరసగా విజయాలు సాధిస్తూ వచ్చారు టీడీపీ నేత కోడెల శివప్రసాద్. 2004 లో వైఎస్ హవాలో కొట్టుకుపోయిన ఉద్దండుల్లో కోడెల ఒకరు. నాటి వరకూ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పులు చేర్పులపై కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలగా అభ్యర్ధులని ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకున్న అభ్యర్ధులని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం అలాగే సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా అభ్యర్ధుల నియోజకవర్గాలని మార్చడం లాంటి చర్యలకు శ్రీకారం చుట్టింది . అయితే పార్టీకి విధేయతగా ఉన్న […]