వైస్సార్సీపీ అధినేత జగన్ నర్సరావు పేట ఎంపీ టికెట్ బీసీ లకు ఇవ్వాలని తలచి ప్రస్తుత ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలను గుంటూరు నుండి పోటీ చేయమని కోరగా అలిగి వైసీపీ ని వీడి టీడీపీ లో జాయిన్ అయిన లావు పల్నాడు పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా తన సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లా మొత్తం మీద ఒక్క బీసీ అభ్యర్థిని కూడా టీడీపీ తరపున పోటీ చేయకుండా నిలవరించే ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యాడు..
ప్రస్తుతం పల్నాడు జిల్లా (నర్సరావు పేట పార్లమెంట్ నియోజకవర్గం) నుండి మాచర్లలో జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, వినుకొండ నుండి జీవీ ఆంజనేయులు, గురజాల నుండి యరపతినేని శ్రీనివాసరావు, చిలకలూరిపేట నుండి పత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు నుండి భాష్యం ప్రవీణ్ లు టీడీపీ నుండి పోటీ చేయనున్నారు. మిగిలిన ఒకే ఒక అసెంబ్లీ స్థానం, అత్యంత కీలకమైనది అయిన నర్సరావు పేట నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అరవింద బాబుకు మొదటి నుండి టికెట్ కన్ఫర్మ్ అనుకోగా, లావు వచ్చాక మొత్తం మారిపోయింది. మొదట జంగా కృష్ణమూర్తిని నర్సారావు పేట నుండి పోటీ చేయించాలని భావించినా ఆయన నిరాకరించడంతో ఒకరిద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ ఇవ్వ జూసినా వారి స్థాయి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది కాదని మళ్లీ బాబు అరవింద్ బాబు వైపు మొగ్గు చూపగా, అరవింద్ బాబు (బీసీ) అసలే వద్దు, కమ్మసామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయించాలని ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని లావు పట్టుబట్టినట్టు సమాచారం.. ఈ విషయం తెల్సి మనస్తాపానికి గురి అయిన అరవింద బాబు నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో కన్నీరు పెట్టుకోగా, తాజాగా ఆయన అనుచరుడు టీడీపీ మాజీ రాష్ట్ర రైతు కార్యదర్శి, మాజీ నర్సారావు పేట మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ ఆవిర్భావం నుండి అదే పార్టీలో ఉంటున్న సీనియర్ నాయకుడు పులిమి రామిరెడ్డి ఆత్మ హత్యా యత్నం చేసి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు.. మూడు రోజులు గడిస్తే తప్ప చెప్పలేం అని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం..
ఇలా జిల్లా మొత్తం 7 సీట్లకు గానూ, ఒక రెడ్డి, ఒక కాపు మినహా మిగిలిన 5 సీట్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే టీడీపీ నుండి పోటీ చేయబోతున్నారు. బీసీ ల పార్టీ అని చెప్పుకునే టీడీపీ లో నేడు బీసీ ల పరిస్థితి ఇది…