గన్నవరం శాసన సభ్యులు వల్లభనేని వంశీ, పవన్ వాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబుభార్య నారా భువనేశ్వరీని తాను అసెంబ్లీలో ఏదో అన్నానని ప్రచారం చేయడం పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యం అని దుయ్యబట్టారు. నిజానికి ఆ ఘటన జరిగిన రోజున అసలు తాను అసెంబ్లీలోనే లేనని వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు విని తనపై నిందలు మోపడం తప్ప తనకి నిజాలు అర్ధం చేసుకుని స్పందించే స్థాయి లేదని విమర్శించారు
తెలుగుదేశం పార్టీలో ఉండగా తనపై లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీ టీం పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేశారని మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో విషప్రచారానికి దిగి తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని చివరికి జునీయర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్నందున తెలుగుదేశం పార్టీలో ఉండకూడదనే కుట్రలకి పాల్పడ్డారని, లోకేష్ నీచ మనస్తత్వం నచ్చక తాను పార్టీ మారితే ఓర్చుకోలేని లోకేష్ తనని టార్గెట్ చేసి విష ప్రచారానికి దిగిన సందర్భంలో నేను ఘాటుగా స్పందించానే తప్పా మరొకటి కాదని ఆ తరువాత తాను ఎప్పుడు ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదని ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకుని మాట్లాడితే మంచిందని హితవు పలికారు.