ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబు ఆడుతున్న డ్రామాలపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు సీఎం జగన్. బీజేపీతో జతకట్టి ఆ పార్టీ విధానమైన ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు చంద్రబాబు పరోక్షంగా మద్దతు పలికినట్టు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక పక్క బీజేపీతో కూటమి కట్టి ముస్లిం సమాజానికి తీవ్ర ద్రోహం చేయడమే కాకుండా మళ్ళీ ముస్లిం సమాజాన్ని మోసం చేయడానికి తప్పుడు వాగ్దానాలు ఇస్తూ ముదిరిపోయిన తొండ మాదిరి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. .
జగన్ అనే నేను సీఎం గా 58 నెలల పాలనలో ముస్లిం సమాజానికి చిత్తశుద్దితో మేలు చేశానని చంద్రబాబు మాత్రం తన పాలనా సమయంలోనే కాకుండా ఇప్పుడు కూడా ఊసరవెల్లి రాజకీయం చేస్తున్నాడని, బీజేపీతో జతకట్టి వారి విధానమైన ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు మద్దతు పలకడం దారుణమైన విషయమని మళ్ళీ ఇదే చంద్రబాబు ముస్లింలకి మేలు చేస్తానని హామీలు ఇవ్వడం ఊసరవెల్లి రాజకీయం కాదా అని ప్రశ్నించారు జగన్. ఆరు నూరైనా నూరు ఆరైనా సరే ముస్లిం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అన్నదే తన అభిమతం అని ఇది వైయస్సార్ బిడ్డ జగన్ మాట అని, ఇలా మొడీ సమక్షంలో చంద్రబాబుకి చెప్పే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు.