అత్యంత కీలకమైన ఎన్నికలుగా రాష్ట్రంలో జరగబోయే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలలో మూడు పార్టీలు ఒకవైపు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకవైపు ఎన్నికల పోటీకి సిద్ధపడుతున్నాయి. టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ దిగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి నాయకత్వం వహిస్తున్న షర్మిల పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం కోటంకు మరింత […]
ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కానీ ఈ దేశానికి రాష్ట్రపతి కన్నా ఎక్కువ గా భావిస్తుంటుంది. బాబు కోసం ఎందాకైనా అంటూ తన పరిధిలో లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. ఇప్పటికే తన పరిధిలో ఉన్న రాష్ట్ర బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ వారితో నింపేసి, ఫక్తు బీజేపీ నాయకులకు టికెట్ దక్కకుండా చేసిన ఘనత వహించారు కూడా. తాజాగా పురందేశ్వరి మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 22 మంది ఐపీఎస్ […]
డీఎస్సీ షెడ్యూల్ ను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని భావించినా కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పరీక్ష నిర్వహణకు బ్రేక్ పడింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు టెట్ రాసి ఫలితాలు కోసం వేచి చూస్తున్నారు. ఈ సందర్భంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణను ఎన్నికలయ్యేవరకూ వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. వాస్తవానికి ఏపీ టెట్ పరీక్షలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఈపాటికే పూర్తి కావల్సింది. కానీ హైకోర్టు ఆదేశాలతో షెడ్యూల్ రివైజ్ అయింది. కొత్త షెడ్యూల్ […]
తెలుగుదేశంకి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేశాడు. నిమ్మగట్టు ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టింది. సంక్షేమ పథకాలకు వలంటీర్లను ఉపయోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీని చేయవద్దని ఆంక్షలు విధించింది. దీంతో అధికార యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు సిద్దం చేసింది. […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొద్ది రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా అనుమానాస్పద వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో లోకేష్ వాహనాన్ని కూడా ఆపి పోలీసులు తనిఖీ చేశారు. కానీ పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. డీజీపీకి టైమ్ దగ్గర పడింది అంటూ ఆయన […]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు ఓటు హక్కును ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఏపీ మహిళా కమిషన్ కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్కు మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి లేఖ రాశారు. అలాగే సాధారణ మహిళలకు సంబంధించి ఆమె పలు విజ్ఞప్తులు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలకు తప్పనిసరిగా వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. చిన్న పిల్లలతో […]
ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నాయి. ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఈ నేపథ్యంలో ఫేక్ ప్రచారానికి తెరతీశాయి. వారంతా మొదట నుంచి గ్రామ, వార్డు వలంటీర్లపై పడి ఏడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారినే టార్గెట్ చేశారు. ఇటీవల ఈసీ మెసేజ్ అంటూ వైరల్ చేశారు. ‘ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం.. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫొటో లేదా వీడియోలు తీసి, వలంటీర్ పేరు, […]
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమీషన్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముడురోజుల్లోనే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ లో 385 యఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.3.14 లక్షల రాజకీయ ప్రచార చిత్రాలను కూడా ఈ సంధర్భంగా తొలగించామని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ మీనా వెల్లడించారు. మూడున్నర కోట్ల విలువైన రాజకీయ పార్టీల మెటీరియల్ను సీజ్ చేసింది. అందులో ఎనభై లక్షల నగదు, కోటిన్నర విలువైన మద్యం సీసాలు ఉన్నాయి. మద్యం అమ్మకాలు, నిల్వలపై నిఘా వేసామని, గత ఏడాది […]
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చక్రి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ జారీ చేశారు. తిరుపతి దిశా పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించుచున్న చక్రి రాజశేఖర్ PC-2514 అను కానిస్టేబుల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి భాకరాపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం ఇచ్చిన హామీల […]
ప్రజా క్షేత్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన అస్త్రమైన సోషల్ మీడియాని వాడుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, అభ్యంతరకర పోస్టులు పెట్టిస్తూ వస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర పోస్టులపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ చానల్స్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా […]