ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొద్ది రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా అనుమానాస్పద వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో లోకేష్ వాహనాన్ని కూడా ఆపి పోలీసులు తనిఖీ చేశారు.
కానీ పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. డీజీపీకి టైమ్ దగ్గర పడింది అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రతిపక్షాల వాహనాలను మాత్రమే పోలీసులు తనిఖీ చేస్తున్నారంటూ డీజీపీతో పాటు ఇంటిలిజెన్స్ ఐజీని కూడా సస్పెండ్ చేయాలని లోకేష్ వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. గతంలో కూడా ప్రభుత్వ అధికారులతో పాటు కొన్ని కేసుల్లో అప్రూవర్లను బెదిరించేందుకు రెడ్ బుక్ లో పేర్లు రాస్తున్నానంటూ లోకేష్ బ్లాక్మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇప్పుడా కేసు న్యాయస్థానంలో పరిధిలో ఉంది
వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులంతా ఎలక్షన్ కమీషన్ కిందే పనిచేస్తూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం ఇంకా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తున్న పోలీసులపై లోకేష్ ఫైర్ కావడం, పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి ముడి పెట్టడం లోకేష్ అనుభవరాహిత్యానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ తీరును చూస్తుంటే లోకేష్ ఎక్కడికి వెళ్లిన వాహనాలను తనిఖీ చేయకూడదనే ఉద్దేశ్యం కనబడుతుంది. మరోసారి లోకేష్ కారును తనిఖీ చేస్తే ఈసారి ఏకంగా ఎలక్షన్ కమీషన్ నే తీసేయాలంటాడేమో అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. బహింరంగంగా డీజీపీని, ఇంటిలిజెన్స్ ఐజీని బెదిరిస్తున్న లోకేష్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.