అత్యంత కీలకమైన ఎన్నికలుగా రాష్ట్రంలో జరగబోయే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలలో మూడు పార్టీలు ఒకవైపు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకవైపు ఎన్నికల పోటీకి సిద్ధపడుతున్నాయి. టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ దిగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి నాయకత్వం వహిస్తున్న షర్మిల పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం కోటంకు మరింత బలాన్ని చేకూర్చడం కోసం పరోక్షంగా అడుగులు వేస్తుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ షర్మిల ఈ రాజకీయ మీటింగ్ లోను గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసును తీసుకొచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ప్రచారం కొనసాగిస్తుంది. అయితే వివేక హత్య కేసులో పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో షర్మిలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. సంబంధంలేని హత్య కేసులో నిరాధారమైన ఆరోపణలతో తమ పరువుకు ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. నోటీస్ ఇవ్వడమే కాకుండా 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా నోటీసుల్లో స్పష్టం చేశారు.
అయితే గతంలో 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు, టిడిపి ప్రభుత్వం. తన కుటుంబానికి తన అన్నలకు ఎలాంటి సంబంధం లేదని ఇది కచ్చితంగా అప్పటి అధికార పార్టీ కుట్రలో భాగంగానే వివేకా గారి హత్య జరిగిందని మీడియా ముందు స్పష్టంగా వివరించడం మనందరికీ తెలిసిందే. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నట్లు ఆరోజు తన కుటుంబానికి గాని అన్నలకు గాని ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు అని బల్లగుద్ది మరి వాదించిన షర్మిల ఈరోజు అదే అన్నలపై అభాండాలు మోపడానికి గల కారణాలు ఏంటో అని సర్వత్రా ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.