ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నాయి. ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఈ నేపథ్యంలో ఫేక్ ప్రచారానికి తెరతీశాయి. వారంతా మొదట నుంచి గ్రామ, వార్డు వలంటీర్లపై పడి ఏడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారినే టార్గెట్ చేశారు. ఇటీవల ఈసీ మెసేజ్ అంటూ వైరల్ చేశారు. ‘ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం.. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫొటో లేదా వీడియోలు తీసి, వలంటీర్ పేరు, ఊరు పేరు పేర్కొని ఏపీ సీఈఓ వాట్సప్ (96766 92888)కు పంపండి అంటూ విపరీతంగా సర్క్యులేట్ చేశారు. దీనిని చాలామంది నిజమేనని నమ్మారు.
అది ఫేక్ అని తేలింది. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఏపీ సీఈఓ (ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్)• ఫేక్ న్యూస్ అని ఖండించారు. వలంటీర్లను ఎన్నికలకు ప్రభుత్వం దూరంగా ఉంచింది. ఈ మేరకు సీఎస్ జవహర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా ఆదేశాలిచ్చారు. దీంతో సేవా సైన్యం ఎన్నికల జోలికి వెళ్లడం లేదు. అయినా సరే కూటమి నేతలు రోజూ దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఫేక్ పోస్టులు తయారు చేసి సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేస్తున్నారు. తమ యంత్రాగాన్ని వారిపై ఉపయోగిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ గురువారం బెదిరింపులకు పాల్పడ్డారు. గ్రామాల్లో రాజకీయాలు చేస్తే జైలుపాలు చేస్తామని బెదిరింపులకు దిగారు.