నిద్ర లేస్తే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు. కానీ బీసీలని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ, వాళ్లకి రాజ్యాధికారం ఏమీ ఇవ్వరని టీడీపీ నేత రావూరు ఈశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ పేరుకు మాత్రమే బీసీల పార్టీ కానీ నిజానికి అది బీసీల వ్యతిరేక పార్టీ అని ఈశ్వరరావు వెల్లడించారు. చంద్రబాబు నాయుడును, టీడీపీని నమ్ముకుని సర్వం కోల్పోయానని మీడియాతో తెలిపిన ఆయన కేవలం తాను బిసి కులానికి చెందిన వ్యక్తి కావడంతో పార్టీలో గౌరవం లేకుండా పోయిందని వాపోయారు.
చిత్తూర్ వైయస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి, ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్ విజయానంద్ రెడ్డి సమక్షంలో రావూరు ఈశ్వరరావు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈశ్వర్ రావ్ మాట్లాడుతూ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్న తనకే మర్యాద లేకపోతే పార్టీ లో ఉన్న బీసీ కార్యకర్తలకు ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఇన్నాళ్ళు టీడీపీలో ఉన్నందుకు తన పరువు పూర్తిగా పోయిందని ఇంకా ఆ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు.
బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీ లకు చేసింది శూన్యం అని, తెలుగుదేశం పార్టీ ఎంత మందిని బీసీలను ఎమ్మెల్సీ గా చేసింది, ఎంతమందిని రాజ్యసభకు పంపిందని ప్రశ్నించారు. 2014 ఎన్నికలలో మొత్తం 600 హామీలు ఇవ్వగా బీసీలకు మేలు చేస్తానని 450 పైగా హామీలిచ్చిన చంద్రబాబు, కనీసం ఒక శాతం పనులు కూడా చేయలేదు. కానీ ఈ విషయాన్ని టీడీపీలో ఉండి కూడా ప్రశ్నించలేకపోయామని ఈ సందర్భంగా ఈశ్వరరావు తెలిపారు.
అసలైన బీసీ పక్షపాతి సీఎం జగన్ అని, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో ఐదు మంది బీసీలకు కేటాయించడంతో అసలైన బీసీ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఈశ్వరరావు వెల్లడించారు. చంద్రబాబు కనీసం ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపించాలనే ఆలోచన చేయలేదని, మండలి విషయంలోనూ అలానే ప్రవర్తించారన, శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి చెందిన బీసీ అభ్యర్థులు 20 మందికి పైగా ఉంటే టీడీపీ వారు కనీసం నలుగురు కూడా లేరు. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ 25 పార్లమెంట్లో 100 సీట్లును బీసీలకు బడుగు బలహీన వర్గాలకు కేటాయించింది కానీ టిడిపి మాత్రం 60 సీట్లను మాత్రమే కేటాయించింది. ఇంకా ఏ విధంగా టిడిపి బీసీల పార్టీ అవుతుంది అని ఈశ్వరరావు ప్రశ్నించారు. బీసీలకు అభ్యున్నతికి, వారికి సరైన గౌరవం దక్కాలి అంటే రానున్ను ఎన్నికలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మనమందరంసీఎం జగన్ నడవాలని వెంట నడవాలని ఈశ్వర రావు పిలుపునిచ్చారు.