బీసీల పుట్టినిల్లు టీడీపీ, బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ టీడీపీ అని చెప్పుకొనే చంద్రబాబు చేతిలో నలిగిపోయిన బీసీ నాయకుల చిట్టా చూస్తే చేంతాడు అంత ఉంటుంది. ఎప్పుడూ సొంత పార్టీలోని బీసీలకు వెన్నుపోటు పొడిచే బాబు ఈసారి పక్క పార్టీల నుండీ గేలం వేసి మరీ వెన్నుపోటు పొడిచాడు. వారిలో ప్రధానంగా వైసిపి నుంచీ లాక్కున్న జంగా కృష్ణ మూర్తి, గుమ్మనూరు జయరామ్ ల పరిస్థితి మరీ దారుణం అని చెప్పొచ్చు. జంగా కృష్ణ మూర్తి […]
‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగింది. భవిష్యత్లోనూ జరగాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలి’ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీసీల సమస్యలపై 50 ఏళ్లుగా పోరాడుతున్నాం. సుమారు 12 వేల ఉద్యమాలకు నాయకత్వం వహించా. ఫలితంగా రెండు వేల జీఓ విడుదలయ్యాయి. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. […]
టీడీపీకి మొదటినుండి వెన్నుదన్నుగా ఉన్న బీసీ కులాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం పరిపాటిగా మారిపోయింది. బీసీల తోకలు కత్తిరిస్తా అని బెదిరించడం బాబుకే చెల్లింది. తాజాగా 2024 ఎన్నికల సందర్భంగా మరోసారి బీసీలకు సీట్లు కేటాయించకుండా దగా చేసాడు చంద్రబాబు. ఓసారి టీడీపీ ఎంపీ సీట్లను పరిశీలిస్తే చంద్రబాబు బీసీలకు ఎంత అన్యాయం చేసాడో తేటతెల్లమవుతుంది. వైజాగ్ ఎంపీగా భరత్, రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి, ఏలూరు ఎంపీగా మాగంటి బాబు, విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, గుంటూరు […]
నిద్ర లేస్తే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు. కానీ బీసీలని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ, వాళ్లకి రాజ్యాధికారం ఏమీ ఇవ్వరని టీడీపీ నేత రావూరు ఈశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ పేరుకు మాత్రమే బీసీల పార్టీ కానీ నిజానికి అది బీసీల వ్యతిరేక పార్టీ అని ఈశ్వరరావు వెల్లడించారు. చంద్రబాబు నాయుడును, టీడీపీని నమ్ముకుని సర్వం కోల్పోయానని మీడియాతో తెలిపిన ఆయన కేవలం తాను బిసి కులానికి […]
సామాజిక న్యాయమే అభివృద్ధిపథంగా ముందుకు సాగుతున్న వైనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. గత 58 నెలల కాలంలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలనే తేడా లేకుండా అన్ని కులాలకు ఈ ముఖ్యమంత్రి సమన్యాయం చేస్తున్నారు. అయితే 2024 శాసనసభ, లోక్సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాతో బీసీలకు 48 శాసనసభ, 11 లోక్సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి వైఎస్ […]
రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా బీసీలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బీసీల ఆత్మీయ సమ్మేళన సభలో ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి బలమైన వర్గాలుగా తీర్చిదిద్దారని సీఎం జగన్ ని కొనియాడారు. బడుగు బలహీనవర్గాల ప్రజలు అగ్రవర్ణాలతో సమానంగా ఎదగాలన్న మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రావ్ కలలను సీఎం జగన్ […]