లోకేష్ కి అమెరికా లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఈయన రికమండేషన్ మీదే సీట్ ఇచ్చింది. కార్నీగిమిలన్ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్ ఆయన.. 2003 లో ఆయన తను పుట్టిననేల కోసం ఏదైనా చేయాలి అనే తపనతో, తన సాటి తెలుగు వారిని సాంకేతిక విద్యలో గొప్ప విద్యార్థులుగా తీర్చుద్దాలని గొప్ప ప్రణాళికతో చంద్రబాబు దగ్గరికి వచ్చాడు…
పదో తరగతి పూర్తి కాగానే రాష్ట్రం లో ప్రతీ మండలం నుండి ఒకరు చొప్పున టాపర్ లని తీసుకొచ్చి… వాళ్లకి ఇంటర్+ఇంజనీరింగ్ ఒకేచోట, ప్రతీ విద్యార్థికి ఎదురుగా సొంతగా ల్యాప్టాప్, క్లాస్ లో రెండు ప్రొజెక్టర్లు, లెర్నింగ్ బై డూయింగ్ పద్దతిలో ఉచితంగా 6 ఏళ్ల కోర్సును ఇప్పించేందుకు ఒక యూనివర్సిటీని పెట్టాలి సార్…
ఇది ప్రొఫెసర్ రాజ్ రెడ్డి ఇచ్చిన ఐడియా…
ఇంకా చెప్పడం పూర్తికాక ముందే… ఏంటండీ ఇది? అంతమందికి కంప్యూటర్ లు ఇచ్చి, 6 ఏళ్లు ఉచితంగా చదువు చెప్పాలా? అసలు ఎలా సాధ్యం ? పిచ్చి వాడి ఆలోచన అండి ఇది… నో కుదరదు……
ఇది బాబు సమాధానం….
దాని తర్వాత ఆయన 5 ఏళ్లు మళ్లీ ఆ ఆలోచన ఎక్కడా బయటపెట్టలేదు… వైయస్సార్ ఫీజు రీయింబర్సుమెంట్ పథకం తెచ్చి ఇంజనీరింగ్ చదువులు ఉచితంగా చదివిస్తున్నాడని తెలుసుకున్నాక… వైయస్సార్ దగ్గరికి వచ్చి బాబు తో చెప్పిన విషయాన్ని చెప్పాడు… నమ్మరు….. పదే పది నిముషాల్లో మనం చేస్తున్నాం… మీరే దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు. ఈ మాట చెప్పింది స్వయానా ప్రొఫెసర్ రాజ్ రెడ్డి గారే.. చెప్పింది ట్రిపుల్ ఐటీ అని పిలవబడే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలోనే…..
రాజ్ రెడ్డి గారు తన ఆలోచన చెప్పిన సరిగ్గా ఏడాదికే 2008 నుండి ఐఐఐటీ లు ఇడుపులపాయ, నూజివీడు, బాసర ఈ మూడు ప్రాంతాల్లో ఏడాదికి 2000 మంది విద్యార్ధుల చొప్పున మొదలైంది… యూనివర్సిటీ కి గవర్నర్ ఛాన్స్లర్ గా ఉండాల్సిన నియమాన్ని పక్కనబెట్టి, ఇంతగొప్ప ఆలోచనను గ్రాస్ రూట్ లెవల్ లో అమలు చేయాలంటే రాజ్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అని ఆయన్నే ఛాన్స్లర్ గా నియమించారు వైయస్సార్……
ఈనాడు ఏ ప్రభుత్వ ఉద్యోగం లో అయినా, సివిల్స్ పరీక్షలో అయినా, సాఫ్ట్వేర్ కంపెనీలలో అయినా ముందుగా ఉండేది ఐఐఐటీ విద్యార్ధులే….. ఎవరూ సాహసించించని, పిచ్చి వాడి ఊహ అనుకునే ఒక గొప్ప కార్యానికి ఆరోజు ధైర్యంగా శ్రీకారం చుట్టారు… ఈరోజు ఆయన లేకున్నా, ఆయన అడుగు వేలాది మంది పల్లెటూరి విద్యార్థుల అభివృద్ధి కి వందల అడుగులకు కారణం అయింది. ఆరోజు పేదవాడి విద్యకోసం.. వారిని ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడానికి తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే, నేడు తన కొడుకు మరో పదడుగులు ముందుకేస్తున్నాడు…..
ప్రభుత్వ బడులు అంటేనే పేదలు కాదు, నిరుపేదలు వెళ్లే సత్రాలు అనుకుని, వాటిని బాగుచేయడం అంటే తేనెతుట్టె కదిలించడం అనుకునే రాజకీయం నాయకుణ్ణి, ప్రత్యర్థులను ఎదుర్కుంటూ… ఎన్ని విమర్శలు వచ్చినా, కార్పోరేట్ సంస్థల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా ఇంచు కూడా భయం లేకుండ, వాటి సమూల ప్రక్షాళన చేసేస్తున్నాడు….
నాడు- నేడు అని స్కూల్స్ రూపురేఖలు మార్చేశాడు… రెండో రోజే పీలికలలా చిరిగిపోయే దుస్తుల స్థానంలో క్వాలిటీ దుస్తులు ఇచ్చాడు, ప్రైవేటు స్కూల్ పిల్లలే బూట్లు వేసుకుని బడికి పోవాలా అని ప్రభుత్వ స్కూల్ పిల్లలకి బూట్లు ఇచ్చాడు, బడికి పంపకుండా పేదరికం వల్ల పనికి పంపుతారని అమ్మఒడి అని అని తల్లి అకౌంట్లో 15 వేలు వేస్తున్నాడు….. ప్రభుత్వ బడికి రావడం అవమానం అనుకునే స్థాయి నుండి మన బడి బాగుంది, మన బడే బాగుంది.. మనం కూడా బడికి పోవాల్సిందే అనే స్థాయికి తెచ్చాడు…
ఈరోజు లక్షల్లో ఫీజు తీసుకునే కార్పోరేట్ బడుల్లో కూడా లేని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాడు… గుండెల మీద చెయ్యేసుకుని ప్రశ్నించుకుందాం… ఇవాళ ఎన్ని ప్రైవేటు బడుల్లో గ్రీన్ బోర్డులున్నాయి? ఇంకెన్ని ప్రైవేట్ స్కూల్స్ లో డిజిటల్ బోర్డు లు ఉన్నాయి…. ఎన్ని చైనా స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్ లు ఉన్నాయి? ఏ ప్రైవేటు స్కూల్ లో పిల్లల చేతిలో ట్యాబ్ ఉండి, దానిలో లక్షల్లో ఛార్జ్ చేసే ఫాకల్టీ చేత చెప్పించిన బైజూస్ లాంటి ప్రాక్టికల్ క్లాస్ కంటెంట్ ఉంది?
ఇంగ్లీష్ మీడియం ఎందుకు అన్నారు, వారి పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారు అంటే ఒక్కరూ సమాధానం ఇవ్వలేదు, టోఫెల్ ఎందుకు అన్నారు, వారి పిల్లలు టోఫెల్, IELTS రాయకుండానే అమెరికా, కెనెడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లలో చదువుతున్నారా అంటే సమాధానం ఉండదు… మనస్సాక్షిని అడగండి, మంత్రి రికమండేషన్ ద్వారా కూడా సీటు ఇవ్వని ఆక్రిడ్జ్ స్కూల్ నుండి ఐక్యరాజ్యసమితి లో ప్రసంగించడానికి ఇప్పటి వరకు ఎంత మంది వెళ్లారు? నిరుపేద గ్రామీణ పిల్లలు అక్కడివరకూ వెళ్లగలిగారు అంటే, జరగకపోయి ఉంటే ఎవరైనా నమ్మే విషయమా?
మన చదువులు “పట్టభద్రత” ఇస్తుంది కానీ “పొట్టబద్రత” ఇవ్వలేకపోతుంది అని ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు అసహనంగా వ్యాఖ్యనిస్తుంటారు… ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా మారడం లేదని, ప్రపంచపోటీ ముందు నిలబడలేకపోతున్నారని విమర్శ ఉంది.. అదే నిజం కూడా.. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన, చాలా ఖర్చుతో కూడిన ఐబీ సిలబస్ ని ఉచితంగా ప్రవేశపెడుతున్నాడు.. ఐబీ వారినే ఆంధ్ర ప్రదేశ్ లో వారి ఆఫీస్ పెట్టుకునేలా ఒప్పించాడు….
ఇంజనీరింగ్ చేశాక, అమీర్పేట లో కోచింగ్ కి వెళ్లి కోర్సులు నేర్చుకుని ఆ మూడు నెలల కోర్సే జాబ్ ఇప్పిస్తుంది కానీ నాలుగేళ్ల చదువు వృథా అవుతుంది… దానిక్కారణం సిలబస్ లో అప్డేషన్ లేకపోవడమే… స్కిల్ డవలప్మెంట్ అని, స్క్రూ డ్రైవర్ వాడటం, లేథ్ మిషన్ లు వాడటం, టైపింగ్ నేర్పించడం కోసం నాలుగు సెంటర్లు పెట్టి కోట్లు కొట్టేయచ్చు… కానీ దానివల్ల ఎంతమంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి?
దానికి ప్రత్యామ్నాయమే ఎడెక్స్ ప్లాట్ఫార్మ్… కేంబ్రిడ్జ్ యూనివేట్సిటీ, మసాచుసెట్స్ యూనివర్సిటీ లాంటి టాప్ 10 యూనివర్సిటీ లలో మాత్రమే ఉండే 2000 రకాల కోర్సులను మన ఉన్నత విద్యా అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం తీసుకొచ్చాడు…. ఇంకా చేస్తాడు… ఇంకా మారుస్తాడు… మీ ఓట్ల కోసం జిమ్ముక్కులు చేయడం చాలా సులువు, కానీ మీ తర్వాతి తరం గొప్పగా జీవించడానికి ఇవాళ దారి పరవడం కష్టం…. అయినా చేస్తాడు…
వీటన్నిటికోసం ఒక్కోసంవత్సరానికి విద్యమీద 32 వేల కోట్లు ఖర్చవుతుంది… అయినా వెనుకడుగు వెయ్యడు…
అందువల్లే… ఆంధ్రప్రదేశ్ ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చే విద్యా అందుబాటు ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ “అతి ఉత్తమ్” రాష్ట్రం గా నిలిచింది…2018-19 లో పాఠశాల స్థూల నమోదు నిష్పత్తి దేశ సగటు 99.21 ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది 84.48 మాత్రమే ఉంది… అది 2023 నాటికి 100% కి చేరింది… నీతి ఆయోగ్ విడుదల చేసిన 2023- స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ (SEQI) ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం లో నిలిచింది..
All India survey of Higher Education report ప్రకారం ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి దేశ సగటు 3.04% అయితే ఆంధ్ర ప్రదేశ్ ది మాత్రం 8.6% గా నమోదు అయింది…
ఇంకా మారుతుంది.. ఖచ్చితంగా మారుతుంది…