ఒడమ్మాబడవా.. కాపాడండయ్యా నన్ను.. ఇదేం బాలేదయ్యా.. సోషల్ మీడియాలో మీమ్స్ పేజీల్లో ఎక్కువ దర్శనమిస్తుంటాయి. ఈ పదాలు పలికింది నెల్లూరు సోగ్గాడు ఆనం వివేకానందరెడ్డి. ఆయన చనిపోయినా ఇంకా యాసను మాత్రం జనం గుర్తుపెట్టుకునే ఉన్నారు. వివేకా గదిలో చోరీ జరిగింది. ఈ విషయం ప్రస్తుతం నెల్లూరు నగరంలో కలకలం రేపింది. మూడురోజుల క్రితం కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆనం నెల్లూరు సిటీ, […]
తెలుగుదేశం ఎన్డీఏలో చేరడంతో ఆ పార్టీ అభ్యర్థులు ముస్లింల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మాకు జై కొట్టండని, ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ పని అవసరమైనా చేస్తామని ఆ వర్గ పెద్దలను బతిమిలాడుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీని మెనార్టీల ద్రోహిగా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. గత ఎన్నికల సమయంలో సభల్లో ఈ విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. 24 ఎన్నికలు వచ్చేసరికి అదే మోదీ పంచన చేరారు. దీంతో ముస్లిం సమాజం టీడీపీపై కన్నెర్ర చేసింది. ఇక వారి […]
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన పేలవంగా సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, టికెట్లు రాని నేతలు హ్యాండ్ ఇచ్చారు. బాబు హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం కావలి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మూడు గంటలకు రోడ్డు మార్గంలో ఎన్టీఆర్ విగ్రహం సమీపానికి చేరుకుని సభ నిర్వహించాలి. కానీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం పర్యటన జరగడం లేదు. జన సమీకరణలో కావలి టీడీపీ అభ్యర్థి […]
తెలుగుదేశం పార్టీలో పెత్తనం చేసేందుకు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) పాకులాడుతున్నారు. స్వార్థంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఈయన చంద్రబాబు నాయుడి చేత టీడీపీ కండువా కప్పించుకున్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. డబ్బులిచ్చి తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్ తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన జిల్లా పెద్ద పాత్ర పోషించిన వీపీఆర్కు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు పెద్దపీట వేయలేదు. కొత్తలో నామమాత్రంగా కలిసి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీ సస్పెండ్ […]
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారు. అసంతృప్తులు, ఇతర వర్గాల నాయకుల్ని పిలిచి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెబుతున్నారు. ఆయన రాకతో జిల్లా శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. 2019లో ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీకి పదికి పది అసెంబ్లీ సీట్లు వచ్చాయి. నెల్లూరు, తిరుపతి ఎంపీలను కైవశం చేసుకుంది. జిల్లాల […]
రాటకొండ ప్రసాద్ అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. అదే కిర్రాక్ ఆర్పీ అంటే వెంటనే తెలిసిపోతుంది. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన ఇతని సొంతూరు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలంలోని సగుటూరు. జబర్దస్ వల్ల కొన్ని సినిమాలు, టీవీ షోలు చేసి పాపులరయ్యాడు. ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వల్ల నిత్యం సోషల్ మీడియాలో నానుతున్నాడు. ఆర్పీకి ఘనమైన చరిత్రే ఉంది. సినిమా డైరెక్షన్ పేరుతో పలువురిని నట్టేట ముంచాడని తోటి జబర్దస్త్ కమెడియన్ […]
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు చాలాకాలంగా గగ్గోలు పెడుతున్నాయి. కానీ అదంతా నిజం కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని రామాయపట్నంలో ఇండోసోల్ ఈనెలాఖరు నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. సదరు సంస్థ సౌర విద్యుత్ కేంద్రాలకు అవసరమైన మాడ్యూల్స్, ప్యానెళ్లు, ఇతర పరికరాలను తయారు చేస్తుంది. ఇది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్ఎస్ఇఎల్) అనుబంధ సంస్థ. తొలిదశ […]
నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి అటు చంద్రబాబు నాయుడు, ఇటు వేమిరెడ్డి ప్రభార్రెడ్డి (వీపీఆర్) వెన్నుపోటు రుచి చూపించారు. దీంతో పోలంరెడ్డి దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయారు. శ్రీనివాసులురెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. గతంలో ఓసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కోవూరు సీనియర్ నేతగా ఉన్నారు. 2019లో ఓడిపోయినా పార్టీకి దూరం కాలేదు. కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వయసు రీత్యా […]
సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి మత్స్యకారుల వలసలను అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగి ఉన్నా మన రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక ఫిషింగ్ హార్బర్ గాని ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ లేదు అంటే మనము ఎంత వెనుకబడి ఉండిపోయాము అనేది అర్థం చేసుకోవాలి.మనకి ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా మనం ఎంతో వెనుకబడి పోయాము అని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకే సారి […]
వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) రాకతో నెల్లూరు జిల్లాలో టికెట్ల లెక్కలు మారిపోతున్నాయి. కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేసి పాతవారిని దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతుండడంతో.. మొదటికే మోసం వస్తుందని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. వీపీఆర్కు చంద్రబాబు నెల్లూరు పార్లమెంట్ సీటును ఖరారు చేసినట్లే. నెల్లూరు సిటీకి మాజీ పొంగూరు నారాయణ, రూరల్కు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉదయగిరికి సురేష్, కావలికి కావ్య కృష్ణారెడ్డిని ఇప్పటికే బాబు ఓకే చేసేశారు. మిగిలిన స్థానాలపై దృష్టి సారించారు. వేమిరెడ్డి […]