సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి మత్స్యకారుల వలసలను అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగి ఉన్నా మన రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక ఫిషింగ్ హార్బర్ గాని ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ లేదు అంటే మనము ఎంత వెనుకబడి ఉండిపోయాము అనేది అర్థం చేసుకోవాలి.మనకి ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా మనం ఎంతో వెనుకబడి పోయాము అని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకే సారి 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు,6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు శంకుస్థాపనలు చేసి పనులను వేగవంతం చేసింది. దీని ద్వారా పక్క రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారుల వలసలు తగ్గుతాయి. ఇక్కడే మత్స్యకారులు వేట చేయడం ద్వారా మన రాష్ట్రము ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. దీనిని సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం లో 289 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా 25 వేల మత్స్యకార కుటుంబాలకి ప్రయోజనం చేకురనుంది. ఈ ఫిషింగ్ హార్బర్ లో 1250 మోటరైజ్డ్, మేకనైజ్డ్ బోట్లు నిలుపుకునేందుకు అవకాశం ఉంది. ఏడాదికి 41,250 టన్నుల మేర సముద్ర మత్స్య సంపద ఉత్పత్తి చేసే అవకాశం. ఈ ఆరు బార్ లో కోల్డ్ చైన్ ఐస్ ప్లాంట్లు చైల్డ్ రూములు వంటి మౌలిక సదుపాయాలు కల్పిన చేశారు .బోట్ రిపేర్ వర్క్ కు సంబంధించిన షాపులు, గేర్ షెడ్లు , నెట్ మెండింగ్ షెడ్లు ఏర్పాటు చేశారు దీని ద్వారా మత్స్యకారులకి మరింత లబ్ధి చేకూరానుంది.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవంతో పాటుగా ఓఎన్జిసి పైప్ లైన్ పనులు కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకి ఐదో విడతకు సంబంధించి 161.86 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించే కార్యక్రమం కూడా చేయనున్నారు. ఓఎన్జిసి పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23458 మత్స్యకార కుటుంబాలకి ప్రభుత్వమే చొరవ తీసుకొని ఓఎన్జిసి ద్వారా ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ. 11,500 చొప్పున 6 నెలలకు గాను 69,000 మొత్తంగా 161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు.