తెలుగుదేశాన్ని ఎన్డీఏలో చేర్చుకోవడం ఆలస్యమైందనే కోపం చంద్రబాబు నాయుడికి ఉందేమో.. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే ఆయన్ను తిట్టి పోశారు. నేడు అతిథి మర్యాదలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనిపై భారతీయ జనతా పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆదివారం చిలకలూరిపేట సమీపంలో ప్రజాగళం సభ జరిగింది. దీనికి మోదీ, చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. లోకేశ్ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. పీఎంను బాబు సన్మానించాలని వ్యాఖ్యాత […]
మోదీపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్న చంద్రబాబు నాడు దేశాన్ని మోదీ నుండి, బీజేపీ నుండి కాపాడాలంటూ దీక్షలు ధర్నాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. నేడు బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో చేసిందని చెబుతున్నాడు… ఐదేళ్ళు అధికారంలో లేక మతిపోయిన చంద్రబాబు ఒకప్పుడు “ అబద్ధాల పుట్ట మోదీ “ అంటూ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడి ప్రస్థుత ఎన్నికల నిమిత్తం మాత్రం అదే బీజీపీతో పొత్తు పెట్టుకున్నాడు. మోదీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చెయ్యలేదు. బీజేపీపై తిరగబడాలి.. […]
మోదీ సభ జరిగింది. కూటమి నుంచి బాబు, పవన్ కూడా మోదీ పక్కన కుర్చున్నారు. మోడీని “తల్లిని కూడా పట్టించుకోనోడు” అని అన్న నోటితోనే… బాబు చిరునవ్వులు చిందిస్తూ కుర్చున్నారు. ఇంక సొంత మీడియా “అహోం అహోం” అంటూ మోసేస్తున్నాయి. ఇంకో రెండు సార్లు మోడీతో నవ్వుతూ ఉన్న ఫోటోలు కనుక బాబు తీయించుకుంటే… “ఈసారి పీయం మీరు అవ్వండి చంద్రబాబూజీ” అని మోడీ బతిమిలాడినట్టు వార్తలు కూడా వడ్డించేస్తారు. కానీ… మోడీ మాట్లాడినంత సేపూ జగన్ను […]
ఈరోజు చిలకలూరిపేట లో ప్రజాగళం పేరుతో జరిగిన ఎన్డీయే కూటమి మీటింగ్ కి వచ్చిన మోదీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటు వెయ్యాలో చెప్పకనే చెప్పాడు.. బాబు అండ్ కో, పవన్ కల్యాణ్ లు ఊహించినట్లు జగన్ మీద అవినీతి ఆరోపణలు చేయకుండా, జగన్ ను ఒక్క మాట అనకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది, దేశానికి ఏం చేసింది అనేది మాత్రమే చెప్తూ, మరోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి […]
ఇవి నాడు బిజెపి పై చంద్రబాబు విమర్శలు మరి నేడు ఉమ్మడి సభలో మోడీకి ఇవన్నీ ఎవరైనా గుర్తు చేస్తే బావుణ్ణు.
‘రేయ్ ఆడిని ఎవరికైనా చూపించండ్రా.. వదిలేయకండ్రా బాబు వాడ్ని అలాగా.. కూర్చోబెట్టి చెప్పండ్రా..’ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రావు రమేష్ చెప్పిన ఈ డైలాగ్ చాలా ఫేమస్. సోషల్ మీడియాలో మీమ్స్ పేజీలు తెగ వాడేస్తుంటాయి. ఆ మాటలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు సరిగ్గా సరిపోతాయి. వాళ్ల నాయకుడు వ్యవహిరించే తీరుకు అభిమానులు పెట్టే పోస్టులకు అస్సలు సంబంధం ఉండదు. తెలిసి చేస్తారో.. మేమింతే అనిపించుకునేందుకు చేస్తారో గానీ.. ప్రతిసారీ నవ్వులపాలవుతుంటారు. […]
ప్రేక్షకులకు స్వాగతం. మీరు విచ్చేశారు ప్రజాగళం పేరుతో జరిగే భజన కార్యక్రమానికి. తెలుగుదేశం అధినేతనైన చంద్రబాబు నాయుడనే నేను ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈరోజు విపరీతంగా పొగుడుతాన్నానమాట. అలాగే కాసేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మోదీపై నానా రకాలుగా ప్రేమ కురిపిస్తారని తెలియజేస్కుంటున్నాను. ఈ భజన కార్యక్రమం పోలింగ్ వరకు కొనసాగుతుంది. ఎవరూ ఎక్కడికి వెళ్లొద్దు వింటూనే ఉండండి. ‘దేశానికి రాబోయేది కొత్త ప్రధానే.. నరేంద్రమోదీ ఇకపై పీఎంగా ఉండరు. భారత రాజకీయాల్లో హుందాతనం మోదీ […]
తమ్ముళ్లూ మీకు పుణ్యం ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు రండి.. మనం బలవంతులమని చూపించుకోవాలి’ ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఇది. ఆదివారం ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట మండలంలో సభ ఏర్పాటు చేశారు. దీనికి మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఎన్డీఏలో చేరాక పెడుతున్న తొలి సభ ఇది. దీనిని సక్సెస్ చేసి క్రెడిట్ కొట్టేసేందుకు నారా వారి పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కమలం పెద్దల అండ ఇప్పుడు […]