మోదీపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్న చంద్రబాబు
నాడు దేశాన్ని మోదీ నుండి, బీజేపీ నుండి కాపాడాలంటూ దీక్షలు ధర్నాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. నేడు బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో చేసిందని చెబుతున్నాడు… ఐదేళ్ళు అధికారంలో లేక మతిపోయిన చంద్రబాబు ఒకప్పుడు “ అబద్ధాల పుట్ట మోదీ “ అంటూ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడి ప్రస్థుత ఎన్నికల నిమిత్తం మాత్రం అదే బీజీపీతో పొత్తు పెట్టుకున్నాడు.
మోదీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చెయ్యలేదు. బీజేపీపై తిరగబడాలి.. నిలదీయాలి.. మోదీ మెడలు వంచాలి అంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమయిపోయాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకప్పుడు మోదీ అబద్ధాల పుట్టయితే.. ఇప్పుడెలా మంచి వారవుతారు.. అంటే చంద్రబాబుకు నచ్చితే రాముడు, నచ్చకపోతే రావణుడా.. అదే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజలందరి మీద రుద్దుతాడు చంద్రబాబు.
బీజేపీతో పొత్తుకై టీడీపీ అర్రులు చాచడం.. దానికై చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మోదీ, అమిత్ షాలతో కాళ్ళ భేరానికి దిగజారడం.. ఇలా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తు కుదరడంతో ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీచేస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీని చంద్రబాబు నాయుడుని తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ భజన చేస్తున్నాడు.. ఒకప్పుడు బహిరంగసభలలో సైతం విమర్శించుకున్న మోదీ, చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలకై కలిసి వేదికను పంచుకున్నారు. అంతమంది కలిసి ఎదుర్కోవాలనుకుంటున్నది ఒకే ఒక్క పార్టీని.. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. అయితే ఈ పరిణామాలన్నీ అర్ధం చేసుకుంటున్న ప్రజలు రాబోయే రోజుల్లో సరైన సమాధానం ఇవ్వబోతున్నారు.