240 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ ఎట్టకేలకు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి రాబోతోందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తూ వచ్చారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మే 5 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.
నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ని తెలుగులో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న విడుదల చేయగా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవడం గమనార్హం. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. లోయలో పడిన తమ స్నేహితుడిని కాపాడుకునేందుకు మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసం ప్రధానాంశంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి ఛాయస్ అని చెప్పొచ్చు.