‘రేయ్ ఆడిని ఎవరికైనా చూపించండ్రా.. వదిలేయకండ్రా బాబు వాడ్ని అలాగా.. కూర్చోబెట్టి చెప్పండ్రా..’ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రావు రమేష్ చెప్పిన ఈ డైలాగ్ చాలా ఫేమస్. సోషల్ మీడియాలో మీమ్స్ పేజీలు తెగ వాడేస్తుంటాయి. ఆ మాటలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు సరిగ్గా సరిపోతాయి. వాళ్ల నాయకుడు వ్యవహిరించే తీరుకు అభిమానులు పెట్టే పోస్టులకు అస్సలు సంబంధం ఉండదు. తెలిసి చేస్తారో.. మేమింతే అనిపించుకునేందుకు చేస్తారో గానీ.. ప్రతిసారీ నవ్వులపాలవుతుంటారు.
ఏపీలో ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో ఓ జనసైనికుడు పెట్టిన పోస్టు వైరలైంది. ‘రేపటి నుంచి మొదలు ఎలక్షన్స్ అయ్యే వరకూ ఆంధ్రాకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.. ప్రకటించనున్న మోదీ.. తాడేపల్లి సచివాలయానికి చేరుకున్న పవన్..’ ఇది ప్రస్తుతం జనానికి నవ్వులు పూయిస్తోంది. వాస్తవానికి ఇలా సీఎంలను నియమించరు. ఎన్నికలయ్యే వరకూ అపద్ధర్మ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉంటారు. ఈ విషయంపై కూడా చాలామంది జనసైనికులకు అవగాహన లేదు. తమ నేత కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడనే బాధలో చాలామంది ఇలా పోస్టులు పెట్టుకుంటూ సంతోషం పడుతున్నారని మిగతా పార్టీల కార్యకర్తలు కామెంట్లు పెడుతున్నారు.
బీజేపీ, టీడీపీతో పొత్తు చాలామంది జనసైనికులకు ఇష్టం లేదు. ఒంటరిగా పోటీ చేసి బలపడాలన్నది వారి కోరిక. కానీ అధినేత మాత్రం పొత్తుల కోసం వెంపర్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. అలాంటి ఒక పోస్టుకు పవన్ అభిమాని పెట్టిన కామెంట్ వైరలైంది. ఒకతను ‘నచ్చట్లేదు పవన్ అన్నా.. ఆ లఫూట్ బీజేపీతో టైఅప్’ అని పెట్టగా దానికి ‘కూల్ అన్నా.. మనల్ని నమ్ముకుని మోదీ ప్రధానమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకో’ అని కామెంట్ పెట్టాడు. అసలు పీఎం ఎలా అవుతారో కూడా చాలామందికి తెలియదంటే ఏమనుకోవాలి. పవన్ ఇలాంటిని వారి చూసి రెచ్చిపోతుంటారు. అంతేలే నాయకుడికే అవగాహన లేక ఎలా పడితే అలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.