మోదీ సభ జరిగింది. కూటమి నుంచి బాబు, పవన్ కూడా మోదీ పక్కన కుర్చున్నారు. మోడీని “తల్లిని కూడా పట్టించుకోనోడు” అని అన్న నోటితోనే… బాబు చిరునవ్వులు చిందిస్తూ కుర్చున్నారు. ఇంక సొంత మీడియా “అహోం అహోం” అంటూ మోసేస్తున్నాయి. ఇంకో రెండు సార్లు మోడీతో నవ్వుతూ ఉన్న ఫోటోలు కనుక బాబు తీయించుకుంటే… “ఈసారి పీయం మీరు అవ్వండి చంద్రబాబూజీ” అని మోడీ బతిమిలాడినట్టు వార్తలు కూడా వడ్డించేస్తారు.
కానీ… మోడీ మాట్లాడినంత సేపూ జగన్ను ఏదొకటి అనాలని, వైసీపీని విమర్శించాలనీ, బాబుని ఆకాశానికెత్తేయాలనీ, పొత్తు ధర్మం పాటించాలని పాపం బాబూ, పవనూ మోడీ ప్రసంగం జరుగుతున్నంత సేపూ ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. వీళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లినట్టు మోదీ జగన్ను విమర్శించలేదు సరికదా… పైపెచ్చు ఫలానా రంగాలలో అభివృద్ధి చేపడతానని చెప్పిన అన్ని రంగాలనూ ఇప్పటికే జగన్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పైగా మొన్న మార్చి అయిదున విశాఖలో జగన్ ప్రసంగంలో ప్రస్తావించిన పాయింట్లనే మోదీ కూడా చెప్పి…. మోదీనోట జగన్ మాట అనిపించుకున్నారు.
మోదీ, రాబోయే అయిదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో చేపడాతమన్న అభివృద్ధిలో ముఖ్యంగా చెప్పినవి ఏమిటంటే పోర్టుల అభివృద్ధి, పోర్టుల అనుసంధానం తద్వారా సాధించబోయే బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారు. కాగా అవి ఇప్పటికే మన ముఖ్యమంత్రి ఆచరణలో పెట్టి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆర్ధిక శక్తిగా మార్చడానికి మనకి వద్ద ఉన్న ప్రకృతి ప్రసాదిత సాధనం తీరు ప్రాంతం. సుమారు తొమ్మిది జిల్లాలలను కలుపుతూ మనకి తీర ప్రాంతం ఉండటం వల్ల లెక్కకు మిక్కిలిగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించిన జగన్ 2019 మేనిఫెస్టోలోనే వాటిని చేర్చారు.
అధికారంలోకి వచ్చాక, దాదాపు 16 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి పోర్టులను అభివృద్ధి చేసారు. అంతకూ మునుపు మనకి కేవలం విశాఖ హార్బరే కేంద్రంగా ఉంటూ కేవలం నాలుగు హార్బర్ల నుంచే ఎగుమతులకు అనుకూలంగా ఉండేవి. కానీ జగన్ వచ్చాకే మరొక నాలుగు పోర్టుల నిర్మాణం కూడా జరిగింది.
తీర ప్రాంతంలో ప్రతి యాభై కిలోమీటర్లకూ పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఫిషింగ్ హార్బర్ వచ్చేలా తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని పోర్టుల అనుసంధానం సాధ్యమయ్యీ ఎగుమతుల సంఖ్య పెరిగే అవకాశం వచ్చింది. తద్వారా మోదీ ఇప్పుడు చేస్తాను అన్న బ్లూ ఎకానమీని ఎప్పుడో జగన్ ఊహించి ఆచరణలో పెట్టటమే కాకుండా ఈ నెల అయిదవ తారీఖున వైజాక్ లో జరిగిన వ్యాపారస్తుల సమావేశంలో మాట్లాడుతూ బ్లూ ఎకనమీ సాధిస్తామని వైజాక్ ని దేశానికి ఎకనమిక్ ఇంజిన్ గా తీర్చి దిద్దుతామని ప్రకటించారు .
నేడు చిలకలూరిపేటలో జరిగిన కూటమి సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ జగన్ చెప్పి ఆచరణలో పెట్టిన బ్లూ ఎకానమీ గురించే ప్రస్తావించి అది సాధించే దిశగా కృషి చేస్తామనటం చూస్తే జగన్ ముందు చూపుని ప్రధాని కూడా అనుసరిస్తున్నాడు అనుకోవచ్చు. భవిష్యత్తులో చంద్రబాబు బ్లూ ఎకానమీ సృష్టికర్త నేనే అని చెప్పినా చెప్పొచ్చు . అది ఆయనకి భగవంతుడిచ్చిన వరమో శాపమో కానీ ఒక బలహీనత అని మాత్రం చెప్పొచ్చు .
వీటితోపాటు పారిశ్రామిక నోడ్స్ను అభివృద్ధి చేస్తూ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ను నెలకొల్పడం, అచ్యుతాపురం, ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయడం,. అలాగే రాష్ట్రమంతటా కూడా సమతుల్య అభివృద్ది ఉండేలా చేయడం వల్ల తీరప్రాంతం నుంచి రాబడి అధికమయ్యే దిశగా అడుగులు ఎప్పుడో వేసారు. మరి జగన్ చేసిన అభివృద్ధి బాటలో మోడీ ఏమి చేస్తాడో చూడాలి.