రాజకీయాలలో గెలుపోటములు సర్వసాధారణమైన అంశాలు అయినప్పటికీ కూడా టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు లేకుండా పోతుంది. ఓటమి భయంతో ఉన్మాదులుగా ప్రవర్తిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కేవలం ఓటమి తప్పదనే అభద్రతాభావంతోనే మంగళగిరిలో టీడీపీ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడికి దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ […]
రాష్ట్రంలో ఏ మూల ఏ నేరం జరిగిన దాని మూలాలు టీడీపీలోనే తేలటం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. పైగా గత కొంతకాలంగా టీడీపీ నేతల మాటలు అరాచకాలకు ఆజ్యం పోస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగే వారి అడుగులు పడుతున్నాయి. అందుకు బలం చేకూర్చేలాగే టీడీపీ నేతలు మాటలు ఉన్నాయి .. గతంలో ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బహిరంగంగానే చెప్పాడు . ‘తరమండి […]
‘మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున టీడీపీ, జనసేన, జనసేన నాయకులు గురువారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి సమర్పించారు. పత్రాల సమర్పణలోనూ లోకేశ్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఆయన తరఫున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులున్నారు. లోకేశ్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అంతకుముందు మంగళగిరి సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]
టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచింది ఈరోజు వరకు బీసీలు మాత్రమే. మరి ముఖ్యంగా అనంతపురంలో టీడీపీకి కొమ్ము కాసింది బీసీ సామాజిక వర్గం. అలాంటి బీసీలకు గత కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదు. దీనితో విసుగు చెందిన కీలక బీసీ కులాలు టీడీపీకి క్రమక్రమంగా దూరం జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం […]
తెలుగుదేశాన్ని తన కుమారుడు లోకేశ్కే ఇస్తానని, నందమూరి వంశానికి ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్పై తనకున్న అయిష్టతను ఆయన బయటపెట్టారని టాక్ నడుస్తోంది. ఇటీవల ఓ జిల్లాలో ప్రచారానికి బాబు వెళ్లగా కొందరు సీనియర్ నేతలు బస్సులో కలిసి మాట్లాడారు. ఎన్టీఆర్ను ప్రచారానికి పిలిపించాలని, అప్పుడే కొంత ఉపయోగం ఉంటుందని, లేకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారట. అంటే మేము పనికిరామా?, పార్టీని కాపాడలేమా?, ఓట్లు […]
ఎన్నికల నేపథ్యంలో ప్రతీ రాజకీయ పార్టీ తమ సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు కొత్త కొత్తగా టార్గెట్ పెడుతుంటాయి. ఇందులో కేవలం టీడీపీ సోషల్ మీడియాకు ఒక విభాగం పేరు పెట్టి, గత మూడు సంవత్సరాలుగా దానికి ప్రెసిడెంట్ గా వున్న నారా లోకేష్ కొత్త పుంతలు తొక్కించారు. తమ సోషల్ మీడియా విభాగానికి ‘ ఐ టీడీపీ ‘ అని పేరు పెట్టి వారి ద్వారా కేవలం వైసీపీ నాయకుల మీద దాడి చెయ్యడమే […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వల్ల ఆరోగ్యకర రాజకీయాలు ఏనాడో పోయాయి. టీడీపీలో హుందానం కరువైంది. పైశాచికానందం పొందడం అధికమైంది. బాబుతో సావాసం చేసేవారు అలాగే తయారయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాశ్వతంగా లేకుండా చేసేందుకు నారా వారు రెండోసారి ప్రయత్నించారు. అయితే ప్రజల ఆశీస్సులతో ఆయన మరోసారి బయటపడ్డారు. కుట్ర చేసింది టీడీపీ, జనసేన కాబట్టే బాధితుడి పట్ల మానత్వం చూపకుండా చుకలనగా మాట్లాడుతున్నాయి. దేశంలో పేరొందిన నేతలు మాత్రం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. దాడిని […]
మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని లోకేష్ చేయని ప్రయత్నం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు శాఖలకు మంత్రిగా పని చేసారనే అపవాదు మూటకట్టుకున్న లోకేష్ టీడీపీకి విజయావకాశాలు లేని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి తన ప్రతాపాన్ని చూపించాలని మాస్టర్ ప్లాన్ వేసాడు. కానీ 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గెలవలేడనే వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. టీడీపీ శ్రేణులకు సైతం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు […]
తమకు సంబంధం లేని విషయంలో క్రెడిట్ కొట్టేడయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఎప్పుడూ ముందుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విషయాలైనా సరే తమకు అన్వయించుకుని అంతా మా వల్లేనని డబ్బా కొట్టుకుంటుంటారు. ఇక వీరి కోసం ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఉండనే ఉంది. తాజాగా టెస్లా విషయంలో చినబాబు ట్వీట్ వేసి అంతా తన తండ్రి దయవల్లేననే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ […]
2014 లో ప్రతి వర్గానికి ఏదొక హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అతని తనయుడు లోకేష్ గెలిచిన తరువాత ఇచ్చిన మేనిఫెస్టోని డిలీట్ చేసుకొని హామీలను గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నడంతో నోటికి వచ్చిన హామీని ఇస్తున్నారు. తాజాగా మంగళగిరిలో అధికంగా ఉన్న చేనేతలకు మరోసారి 2014 లో ఇచ్చిన హామీలనే మరోసారి 2024 లో అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇస్తున్నారు. చేనేతలకు జీఎస్టీ రద్దు చేస్తాము అని ముడి సరుకు ధరలు […]