తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి సన్నిహితుడు, అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్హత్యా రాజకీయాలకు తెరతీశాడు. ఎంతో మంది ఈ సీటు కోసం ప్రయత్నించగా బాబు రమేష్కు వచ్చేలా చక్రం తిప్పాడు. ఇప్పుడు ఈయన ఓటమి భయంతో అనేక పనులు చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. ఆయన అనకాపల్లిలోని స్వగ్రామం తారువలోని ఇంటి వద్ద ఉండగా కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్తో విజువల్స్ తీశారు. దీంతో అనుమానం వచ్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరా తీసి వారిని పట్టుకుని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఆ ముగ్గురు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. ఈ సందర్భంగా వారి వద్దనున్న బీజేపీ కండువాలు, జెండాలను స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై ముత్యాలనాయుడు స్పందించారు. నన్ను అంతమొందించాలని సీఎం రమేష్ చూస్తున్నాడు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారు. నా ఇంటి మీద డ్రోన్ ఎగరేయాల్సిన అవసరమేముంది? రౌడీయిజం గుండాయిజం చేయాలని రమేష్ చూస్తున్నాడు. ప్రజాక్షేత్రంలో నాపై గెలవలేనని అంతమొందించే కుట్రలు చేస్తున్నారు. వచ్చిన వారు కూడా సీఎం రమేష్ పంపితేనే వచ్చామని చెబుతున్నారు. సీఎం రమేష్ చెబితేనే డ్రోన్తో విజువల్స్ తీశామని అంటున్నారు. వారు మా ప్రాంతానికి చెందిన వ్యక్తుల కాదు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో రెక్కీ నిర్వహించాల్సిన అవసరమే ఉంది. స్థానికులు మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ముత్యాలనాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.