ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ప్రభుత్వం జగన్ దే అని అనేక మంది చెప్పుకుంటుంటే, కాదు చంద్రబాబుదే అని ఎల్లో మీడియా బాకాలు ఊదుతూ ఉంది. ఇప్పటికే పలు జాతీయ సర్వేలు ఏపీ లో మళ్ళీ రాబోయేది జగనే అని తమ సర్వేల ద్వారా కుండబద్దలు కొట్టేసినా అక్కడక్కడా తెలుగుదేశం శ్రేణులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రజలంతా జగన్ వైపు ఉంటే . ఒక వర్గం మీడియా మొత్తం బాబుని బుజానికి ఎత్తుకుని ఊరేగుతున్నాయని ఇప్పటికే ఏపీలో […]
రాష్ట్రం లో అన్ని ప్రధాన పార్టీ లు హోరా హోరీగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం తో ముగియనుంది. మరో 48 గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపద్యంలో పార్టీల ప్రచార మైకులు మూగబోనున్నాయి. 57రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తం గా అధినేతల సుడిగాలి పర్యటన లు పోటా పోటీగా అభ్యర్ధుల దుమ్మురేపిన ప్రచారాలతో రాష్ట్రం లో ఎన్నికల వేడి వేసవి వేడిని దాటిపోయిందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్ని […]
ఈనెల 13 న జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ మరో లేఖతో కలకలం సృష్టిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ వాసులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రస్తావిస్తూ జరగబోయే ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి జనసేన పార్టీలను శాశ్వతంగా సముద్ర గర్భం లో కలిసిపోయేలా తీర్పుని ఇవ్వాలని కోరారు. వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనలో పేదవాడు కడుపునిండా అన్నం తినే పరిస్థితి ఉందని, పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే […]
పసుపు మీడియా, పసుపు పత్రికలు, ఐటీడీపీ ఆధ్వర్యంలో నడిచే టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలను నమ్మి ఎవరైనా చంద్రబాబు పార్టీకి ఓటు వేద్దామనే ఆలోచన ఉంటే వారు మరొకసారి ఆలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు వైసీపీ మద్దతు దారులు. ఇప్పటికి మించిపోయింది లేదని వారి ప్రచారాన్ని కాసేపు పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్ చెబుతునట్టు మీ ఇంట్లో మేలు జరిగిందో లేదో ఇంట్లో ఉన్న పెద్దవారితో, మహిళలతో చర్చించాకే నిర్ణయం తీసుకోమనేది వారి మాట. పొరపాటు జరిగితే […]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు బదులు ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్లలోనే ఉద్యోగులు తమ ఓటును వేశారు. పోలింగ్ అంత జరిగిన తర్వాత జరిగిన పొరపాటును అధికారులు గమనించారు. ఈ చర్య వల్ల 1219 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఉద్యోగుల ఫిర్యాదుతో మరోసారి పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని సీఈసీ ఆదేశించింది. దీంతో ఈ రోజు, రేపు చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. […]
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారని రాజానగరం సభలో సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం […]
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్న టీడీపీ, ఆఖరికి తమ అరాచకాలకు మూగ జీవులైన విదేశీ పక్షులను కూడా వదల్లేదు. ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రంలో స్థానిక టీడీపీ నాయకుల వల్ల పక్షులకు రక్షణ లేకుండా పోయింది. అప్పట్లో చేపల కోసం చెరువులను ఎండబెట్టడంతో విదేశాల నుండి ఉప్పలపాడుకు తరలి వచ్చే ఎన్నో రకాల పక్షులు మృత్యువాత పడ్డాయి. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారాన్నే రేపింది. […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాలలో జోరుగా ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే, పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు చర్యలు ప్రజలని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కాపు సంక్షేమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మొదట జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని భావించిన ఆ పార్టీలో అవలంబిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీలో చేరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మొదట జనసేనలో చేరుతారు అనుకున్నా […]
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరుపున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు. ఈనెల 6, 8 తేదీలలో పర్యటన ఉంటుందని ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ మే 6వ తేదీన ఢిల్లీ నుంచి రాజమండ్రి చేరుకుని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరికి […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచిత్రమైన వ్యక్తి. తనను తాను మంచివాడుగా చిత్రీకరించుకుంటాడు. చేయని పనులను కూడా చేశానని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేస్తాడు. బహుశా ఆయన మాటల్ని గుడ్డిగా నమ్మే గొర్రెల్లాంటి అభిమానులు ఉండడమే కారణం కావొచ్చు. పవన్కు నెల్లూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన తండ్రి వెంకట్రావు ఉద్యోగరీత్యా కొంతకాలం ఇక్కడ ఉన్నప్పుడు చదువుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాక ఈ ఊరి పేరు సేనాని అనేకసార్లు వాడాడు. నోటికొచ్చింది చెప్పేశాడు. తను అడిగే ప్రశ్నలకు టీచర్లు […]