ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ప్రభుత్వం జగన్ దే అని అనేక మంది చెప్పుకుంటుంటే, కాదు చంద్రబాబుదే అని ఎల్లో మీడియా బాకాలు ఊదుతూ ఉంది. ఇప్పటికే పలు జాతీయ సర్వేలు ఏపీ లో మళ్ళీ రాబోయేది జగనే అని తమ సర్వేల ద్వారా కుండబద్దలు కొట్టేసినా అక్కడక్కడా తెలుగుదేశం శ్రేణులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రజలంతా జగన్ వైపు ఉంటే . ఒక వర్గం మీడియా మొత్తం బాబుని బుజానికి ఎత్తుకుని ఊరేగుతున్నాయని ఇప్పటికే ఏపీలో రాజకీయలపై పలువురు తమ అభిప్రాయాలని చెబుతున్న వేళ ప్రముఖ సర్వే సంస్థ గా పేరు ఉన్న ఆరా అధునేత మస్తాన్ సైతం తమ అభిప్రాయాన్ని పరోక్షంగా ఒక ప్రముఖ మీడియా చానల్ తో పంచుకున్నారు.
సదరు మీడియా ఛానల్ అడిగిన ప్రశ్నకు ఆరా మస్తాన్ సమాధనాం ఇస్తూ పార్టీలు ఎన్నికలకి సిద్ధంగా ఉంటే ప్రజలు కూడా ఓట్లు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారని, పరోక్షంగా జగన్ సిద్ధం, సంసిద్ధం నినాదాన్ని ప్రస్తావించారు. అలాగే సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి ప్రధాన రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయా వర్గాల్లో ఆ పార్టీకి చాలా అనుకూలంగా ఉందని కుండబద్దలు కొట్టారు ఆరా మస్తాన్. జగన్ సైతం నా ఎస్సీ , నా ఎస్టీ , నా బీసీ, నా మైనారిటీ నినాదంతో ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆరా మస్తాన్ ప్రస్తావించింది వైసీపీ గెలుపు గురించే అనే వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆరా మస్తాన్ తన సర్వే ద్వారా ఇప్పటి వరకు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదని తన ట్రాక్ రికార్డ్ చెబుతున్న సత్యం . అటువంటి వ్యక్తి పరోక్షంగా చెప్పిన మాటలు వైసీపీ అభిమానులకి మరింత బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి.