జగన్ వ్యక్తిత్వంపై, జగన్ ప్రభుత్వ పనితీరుపై ఎప్పుడు ఏదొక అర్థం లేని విమర్శలు కురిపిస్తూ ప్రజల మైండ్ సెట్ ని కంట్రోల్ చేసే థీయరీని చంద్రబాబు మొదటినుండి ఫాలో అవ్వడం అందరికి తెలిసిన విషయమే. అనుకూల ఛానల్స్ లో తలకమాసిన వారిని ఆర్ధిక వేత్తలుగా , రాజకీయ విశ్లేషకులుగా ట్యాగులు తగిలించి నిత్యం జగన్ పై జగన్ ప్రభుత్వంపై నిందలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య.
ఇటీవల ఇన్స్టాలో రీల్స్ చేసుకునే గంటా వెంకటేశ్వర రావు అలియాస్ జీవీ రావును ఆర్ధిక నిపుణుడంటూ ట్యాగ్ తగిలించి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తప్పుడు ఆరోపణలు చేయించారు. నిజానికి ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కారణంగా ఘంటా వెంకటేశ్వరరావును రిజిస్టర్ మెంబర్గా రెండేళ్లపాటు తొలగించడంతో పాటు 50వేల జరిమానా కూడా విధించినట్టు ఐసీఏఐ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఇక ఇప్పుడు ఉయ్యూరి లోకేష్ వ్యవహారం కూడా ఇలాగే ఉంది అమెరికా నుంచి వచ్చినవాడిగా డాక్టరుగా తనకి తాను పరిచయం చేసుకుని జగన్ పై దేశ భత్రతపై ఎల్లో మీడియాలో కూర్చుని తప్పుడు ఆరోపణలు చేసిన ఉయ్యూరి లోకేష్ మెడికల్ లైసెన్స్ కూడా న్యూ యార్క్ స్టేట్ హెల్త్ కమీషన్ సస్పెండ్ చేసింట్టు రిపొర్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తన ప్రవర్తన కూడా అమెరికాలో సరిగా ఉండదనే వాదన ఉంది. ఇతనిని తెచ్చి ఎల్లో మీడియాలో చంద్రబాబు కూర్చో పెట్టి దేశ భద్రతపై కామెంట్స్ చేయించడం క్షమించరాని నేరం అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం కులం కార్డు అడ్డం పెట్టుకుని ఇటువంటి వారికి రిటర్న్స్ ఆశ చూపి చంద్రబాబు తాను ఆడే వికృత క్రీడలో పావులుగా చేసుకుంటున్నాడని. పిచ్చి వాళ్ళన్ని, మనసు స్థిమితం లేని వారిని, హంతకులని , తెచ్చి జగన్ పై ఆరోపణలు చేయించడం దానికి ఎల్లో మీడియా వంత పాడటం చూస్తే రాష్ట్రంలో చంద్రబాబే క్రిమినల్స్ కి లైసెన్స్ ఇచ్చి ప్రజలపైకి వదులుతున్నారనే అభిప్రాయం పలువురు రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట. ఇప్పటికైనా చంద్రబాబు ఇలాటి నీతిమాలిన రాజకీయాలు వదులుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.