2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాలలో జోరుగా ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే, పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు చర్యలు ప్రజలని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కాపు సంక్షేమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మొదట జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని భావించిన ఆ పార్టీలో అవలంబిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీలో చేరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మొదట జనసేనలో చేరుతారు అనుకున్నా ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆశ్చర్యపోవడం జనసేన నేతల వంతు అయింది. ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పవన్ కళ్యాణ్ కి ప్రత్యర్థిగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న వంగ గీతాకు తన మద్దతును ప్రకటిస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ముద్రగడ పద్మనాభంను ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్, ముద్రగడ కుమార్తె అయిన బార్లపూడి క్రాంతి చేత ముద్రగడకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడించారు. క్రాంతి మీడియాతో మాట్లాడుతూ మా సపోర్ట్ పవన్ కళ్యాణ్ కి ఉంటుందని తెలిపింది. దానికి ముద్రగడ స్పందిస్తూ తన కూతురికి పెళ్లి చేశానని, ఇప్పుడు తన కూతురు తన ప్రాపర్టీ కాదని, వాళ్ల అత్త మామలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటుందని .. వారిని ప్రలోభ పెట్టి నా కూతురు చేత నామీద మాట్లాడిస్తున్నారంటూ స్పందించారు. అంతటితో ఆ విషయం పూర్తి అయింది అనుకుంటున్న వేల ముద్రగడ కుమార్తె క్రాంతి, పవన్ కళ్యాణ్ సభలో ప్రత్యక్షమైంది. తుని సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో క్రాంతిని ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయిస్తానంటూ కీలక హామీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ప్రోద్బలం తోనే ఆ విధంగా మాట్లాడిందంటూ పిఠాపురం వాసులు అనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన పొన్నూరు సభలో అంబాటి రాంబాబు అల్లుడు గౌతమ్ చేసిన వీడియో గురించి స్పందిస్తూ తన అల్లుడే ఓటు వేయొద్దని చెబుతున్నాడని చెప్పుకొచ్చాడు. దానికి స్పందించిన అంబటి రాంబాబు తన రెండో కూతురిని గౌతమ్ కి ఇచ్చిన మాట వాస్తవమని నాలుగు సంవత్సరాల క్రితమే వారిద్దరూ విడిపోయారని ఇప్పుడు అలాంటి వారి చేత వీడియోలో మాట్లాడించి తనపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇలా వరుస సంఘటనలు కుటుంబాల మధ్య కలహాలు సృష్టిస్తూ కుటుంబ సమస్యలు తెలుసుకోకుండా వారితో ఇలాంటి ప్రకటనలు చేయించి రాజకీయ లబ్ధి పొందే దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఉండడంతో ప్రజలందరూ పవన్ కళ్యాణ్ వైఖరిని అసహ్యించుకుంటున్నారు.