2014 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చి, సీఎం కాగానే మేనిఫెస్టో చంద్రబాబు మాయం చేసాడు. కులానికో డజను చొప్పున హామీలు ఇచ్చి, వింత వింత వరాలు ప్రకటించాడు. కొన్ని హామీలు అయితే చూడగానే నవ్వు కూడా వస్తుంటుంది. ఎన్నికల్లో గెలవడానికి అవసరం అయితే చందమామ పైకి తెలుగు వారు వెళితే అక్కడ భోజనానికి ఇబ్బంది లేకుండా మీద చంద్రన్న క్యాంటీన్లు పెట్టిస్తా అని కూడా హామీ ఇవ్వగల ఘనుడు..
2014 మేనిఫెస్టో లో అతిపెద్ద మోసం, బాబు ను కేవలం 1.5% ఓట్లతో గెలిపించిన హామీ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ… కానీ చేసింది 10 వేల కోట్లే అదీ ఐదు విడతల్లో.. నేను హామీ ఇచ్చా దాన్ని జగన్ పూర్తి చేయాలని డిమాండ్ చేసిన ఘనత బాబుది..
పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేయకుండా చేతులెత్తేశాడు. ఎన్నికల కు ముందు ఇచ్చిన హామీని గెలిచిన తర్వాత నెరవేర్చలేం అని అసెంబ్లీ లో మంత్రి ప్రకటించడం ఎన్నికల ఫ్రాడ్ కిందకి రాదా?
ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి డిపాజిట్ చేసిన దాఖలాలు లేవు. అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తాం అన్నాడు, తాను ఇవ్వకపోగా జగన్ ఇస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుపుల్ల వేయబోయాడు..
ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇవ్వాలి, కానీ ఇచ్చింది ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన వారికే..
అంతేనా… మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 650 హామీల్లో పూర్తిగా అమలు చేసిన ఒక్కటంటే ఒక్క హామీ కంటికి కానరాదు. హామీలు ఉండేవి ఇవ్వడానికే, అమలు చేయడానికి కాదని బలంగా నమ్మే బాబు, మళ్లీ ఈసారి సూపర్ సిక్స్ పేరుతో వారాల జల్లు కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈసారి మోసపోవడానికి జనాలు మాత్రం సిద్ధంగా లేరు..