నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తొలుత రామ్మూర్తి నగర్లోని క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం విజయసాయిరెడ్డి నెల్లూరులోని కలెక్టరేట్కు చేరుకుని ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట స్నేహితుడు, రాజ్యసభ్య సభ్యుడు బీద రవిచంద్ర, కుమార్తె నేహారెడ్డి తదితరులున్నారు. […]
రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి మోగింది. దీంతో నాలుగు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతంగా మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ స్థానం నుండి పోటీ పడుతున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వైసిపి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన వీరిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా గత […]
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారు. అసంతృప్తులు, ఇతర వర్గాల నాయకుల్ని పిలిచి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెబుతున్నారు. ఆయన రాకతో జిల్లా శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. 2019లో ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీకి పదికి పది అసెంబ్లీ సీట్లు వచ్చాయి. నెల్లూరు, తిరుపతి ఎంపీలను కైవశం చేసుకుంది. జిల్లాల […]
నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్సిపి ప్రకటించింది. పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరు జిల్లాలో మొదటిసారి అడుగుపెడుతున్న విజయసాయిరెడ్డికి నెల్లూరు జిల్లా ప్రజల నుంచి అపూర్వమైన ఘన స్వాగతం లభించింది. మొదట నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని వైఎస్ఆర్సిపి భావించి, పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని కావాలని పట్టుబడడంతో అప్పటికే […]
నరసరావుపేట లోక్ సభ సమస్వయకర్తగా నియమితులైన తరువాత తొలిసారి మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు (ఫిబ్రవరి 14, 2023) పల్నాడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు. నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఈ దఫా బీసీలకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించడంతో అనిల్ కుమార్ యాదవ్ సమన్వయకర్తగా నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యం లో […]
2014 నుండి కాంగ్రెస్ పతనం మొదలైంది, 2029 నాటికి భారత్కు కాంగ్రెస్ నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్ తీరుపై మండి పడ్డారు. ఆయనేమన్నారంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించిందని కానీ దేశాన్ని అభివృద్ధి చేయలేదు. కురువృద్ధ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతున్న కాంగ్రెస్ […]
– కాంగ్రెస్ పార్టీపై విజయసాయిరెడ్డి కన్నెర్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగ్గా ఎంపీ పాల్గొన్నారు. ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కన్నెర్ర చేశారు. ఆయన ఏమన్నారంటే.. 2004లో తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఎన్నికల్లో లాభం పొందాలని […]
ఈ నెల 31న విజయవాడలో జరిగనున్న సామాజిక సాధికార యాత్ర మహాసభ సందర్భంగా వాటి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి విజయసాయి రెడ్డి మంగళగిరి విచ్చేసారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి లో మూడో సారి వైసీపీయే గెలవనుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో తెలుగుదేశం పార్టీకి గెలిచిన దాఖలాలు లేవన్నారు. లోకేష్ పోటీ చేస్తే, ఈ సారి లోకేష్కు ఇక్కడ ఓటమి తప్పదన్నారు. వైసీపీ నుండి బిసీ కేండిటేట్గా […]