నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్సిపి ప్రకటించింది. పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరు జిల్లాలో మొదటిసారి అడుగుపెడుతున్న విజయసాయిరెడ్డికి నెల్లూరు జిల్లా ప్రజల నుంచి అపూర్వమైన ఘన స్వాగతం లభించింది. మొదట నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని వైఎస్ఆర్సిపి భావించి, పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని కావాలని పట్టుబడడంతో అప్పటికే ఆ స్థానం నుంచి ముస్లిం మైనార్టీకి చెందిన అభ్యర్థిని పోటీలో దింపాలని నిర్ణయించిన తరుణంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సీట్ ని నిరాకరించారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టికెట్ నిరాకరించడంతో అలిగిన వేమిరెడ్డి, తనకి అన్ని విధాలుగా గౌరవ మర్యాదలు ఇచ్చిన వైఎస్ఆర్సిపిని కాదని టిడిపి తీర్థం పుచ్చుకున్నాడు . వేమిరెడ్డి టిడిపిలోకి పోవడంతో నెల్లూరు ఎంపీ అభ్యర్థిత్వానికి పార్టీ పెట్టిన మొదటి నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే నిలిచిన , ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీలోకి దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయించింది. నెల్లూర్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ రోజులు నెల్లూర్ కి మొదటిసారి వచ్చిన విజయసాయి రెడ్డికి జిల్లా ప్రజలు ఘనంగా ఆహ్వానించారు. ఇవాళ ప్రజలు పలికిన ఘనస్వాగతం చూస్తుంటే నెల్లూరులో గతం కంటే ఎక్కువ మెజార్టీ రావచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.