ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాగా మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్రపాపారాయుళ్లు […]
ఎన్నికల వేళ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా అధికార పార్టీని తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. కానీ నారా వారు ప్రతి సభలో ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్నికల కోడ్ మొదలయ్యాక ఇది మరీ ఎక్కువైంది. ప్రతి బహిరంగ సభలో […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ ను రేపు దాఖలు చేయనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగియనుంది. చివరి మేమంతా సిద్ధం సభ ముగిసిన తర్వాత టెక్కలి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి గన్నవరంకి విమానంలో వస్తారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో బస చేసి రేపు ఉదయం 8.15 నిమిషాలకు గన్నవరం నుంచి కడప చేరుకుంటారు. కడప నుంచి […]
Sslc అనగా సెకండరి స్కూల్ లివింగ్ సర్టిఫికెట్,టెన్త్ పరీక్షలు అన్ని సబ్జెక్ట్ లలో పాస్ అయ్యిన వారికి ఇస్తారు. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఈ sslc విధానాన్ని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య గారి హయాంలో అనగా 80 అక్టోబర్ నుండి 82 పిబ్రవరి మద్య కాలంలో రద్దు చేసి ssc విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎడ్యుకేషన్ వద్దకు వద్దాం, నిన్న నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ అందులో […]
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సంక్షేమ పాలన అందించి పేదల పాలిట తన కమిట్మెంట్ ని నిరూపించుకున్న జగన్, రాజకీయ యవనిక పై తనకంటూ ఒక ముద్ర ఉండిపోయేలా చేసుకున్నారు. పోరాట యొధుడిగా, సంక్షేమ సారధిగా జగన్ పేదల మనసుల్లో గూడుకట్టుకున్నారనేది కాదనలేని సత్యం. 5ఏళ్ళు పాలించడానికి ప్రజలు తీర్పు ఇస్తే 2ఏళ్ళు కరోనాతో పోయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా సంక్షేమం అందించి ప్రజలని ఆదుకున్న తీరు దేశ వ్యాప్తంగా […]
నారా వారు నోరు విప్పితే అన్ని అతుకుల బొంతలమాటలే.. అర్థపర్ధం లేని కూతలే అని మరోసారి రుజువు అయింది. నిజం ఆ నోటనుండి ఆ ఇంటి నుండి ఎప్పటికీ బయటకి రాదు అనే మాట మరొక్కసారి నిజమైంది. అగ్గిపిల్లా సబ్బుబిళ్ళ కుక్కపిల్ల కాదేది కవిత కనర్హం అన్నట్లు ఆయన మాట్లాడితే ప్రతిదీ నేనే అన్నిటికీ నేనే అన్నీ నేనే అని చెప్పుకుంటూ తిరుగుతాడు. అసలు ప్రపంచంలో కనిపించే వినిపించే ప్రతిదానికి నేనే కారణం అన్నట్లు ఉంటాయి ఆయన […]
నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తొలుత రామ్మూర్తి నగర్లోని క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం విజయసాయిరెడ్డి నెల్లూరులోని కలెక్టరేట్కు చేరుకుని ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట స్నేహితుడు, రాజ్యసభ్య సభ్యుడు బీద రవిచంద్ర, కుమార్తె నేహారెడ్డి తదితరులున్నారు. […]
2024 సార్వత్రిక ఎన్నికలకు 3 వారాల సమయం కూడా లేదు వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే 99 శాతం ఆ […]
మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుతోంది. ఈ సందర్భంగా మంగళవారం పెద్దిపాళెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఆయన మాటల్లోనే.. ‘మీ అందరికీ ఒకటే చెబుతున్నాను. అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. ఒక్క జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగాS బీజేపీ, కాంగ్రెస్. వీళ్లందరే కాకుండా మనం యుద్ధం చేస్తోందంటే వీళ్ల కుట్రలతో, […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా నష్టపోయిన సీమాంద్ర ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుని తిరిగి తెలుగు వారి సత్తాని దేశానికి పరిచయం చేస్తూ సగర్వంగా నిలబడాలనే ఆకాంక్ష రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ నేపధ్యంలోనే అనుభవం ఉన్న నాయకుడనే ఒకే కారణంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీమాంద్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అదినాయకుడు చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేవలం అనుభవమనే ప్రాత్రిపదికన స్వల్ప ఆదిక్యతతో విజయం సాధించి అధికారంలోకి […]