పల్నాడు జిల్లా ఈవూరివారిపాలెం డొంక సమీపంలో ఓటు వేసి తిరిగి వస్తుండగా జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన ఘటన తెలిసిందే. ఈ దుర్ఘటన కు సంభంధించి సీఎం జగన్ స్పందించారు. బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తిరిగి వస్తుండగా […]
టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాకిచ్చింది.. తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు చేసిన అభ్యర్ధనను తోసిపుచ్చింది. చంద్రబాబు పిటిషన్ ను కొట్టేయడంతో పాటు బాంబే హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే 2010 జూలైలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బాబ్లీ ప్రాజెక్టును చుట్టుముట్టి నిరసన తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో మహారాష్ట్ర సరిహద్దుల్లోనే మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబుతో పాటు 66 మందిని అదుపులోకి తీసుకుని రిమాండుకు […]
ఎన్నికల్లో తమ ఓటును ప్రజలు ఎవరకి నచ్చిన పార్టీకి వాళ్లు వేసుకుంటారు, కొంత మంది ప్రలోభాలకు లొంగినా మెజారిటీ ప్రజలు మాత్రం ప్రభుత్వ పనితీరును విశ్లేషించుకుని మాత్రమే వాళ్లకు నచ్చిన పార్టీలకు ఓటు వేస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం పార్టీలకు, కులాలకు అతీతంగా చేసిన మంచిని దృష్టిలో పెట్టుకుని వైసీపీకి ఓటు వేసిన కన్నతల్లికి ఆమె కొడుకు మహా శాపంగా మారాడు, వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లినే హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమీషన్ ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వెళ్ళడించారు. తుది పోలింగ్ శాతం 80.66 గా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2 శాతం మొత్తం కలుపుకుని 81.86 శాతంగా పోలింగ్ శాతం నమోదైందని ఆయన ప్రకటించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే భారీగా నమోదైన పోలింగ్ శాతంగా ఆయన చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కన్నా ఇది 2 శాతం అధికంగా కనిపిస్తుంది. […]
ఆళ్ళగడ్డలో భూమా వర్సెస్ ఏవీల మధ్య కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియా బాడీ గార్డ్ పై తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. అయితే ఈ దాడి వెనుకాల ఏవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని భూమా వర్గం ఆరోపిస్తుంది. భూమా నాగిరెడ్డి ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిన విషయమే అయితే భూమా నాగిరెడ్డి మరణం తరువత అఖిలప్రియా వ్యవహార శైలితో సరిపడక ఏవీ సుబ్బారెడ్డి వీరికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినా అఖిల […]
ఐపీఎల్ 2024 లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది, ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58), స్టబ్స్ (57) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. మిగతా […]
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గాలి బలంగా వీచిందని, జగన్ పిలుపు మేరకు అన్ని ప్రాంతల ప్రజలు భారీ స్థాయిలో పోలింగ్ లో పాల్గొని తిరిగి వైసీపీకి పట్టం కట్టేందుకు ఓటు వేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ముందు నుండి చెబుతునట్టుగానే తన ప్రమాణ స్వీకారాన్ని విశాఖనుండే చేయబోతునారని , దీనికి సంబంధించిన తేదీని వివరాలను రెండు మూడు రోజుల్లో ఖరారు చేసే కార్యక్రమం జరుగుతుందని ఆయన విలేఖరుల సమావేశంలో […]
రాష్ట్రంలో నిన్నటి రోజున వాడి వేడిగా సాగిన ఎన్నికలు ముగిసిన తరువాత నేడు తొలిసారి జగన్ తన సందేశాన్ని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించడానికి సునామీలా వచ్చిన ఓటర్లకు పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. రాబోతే తన ప్రభుత్వంలో మరింత మెరుగ్గా పాలన కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. జగన్ ట్వీటర్ లో పెట్టిన ట్వీట్ యథాతథంగా చూస్తే ” నిన్న జరిగిన ఎన్నికల్లో […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత. ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా నేరవేర్చిన సీఎం వైయస్ జగన్ గారినే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకున్నారని, దాని ఫలితమే పెద్ద ఎత్తున మహిళలు వృద్దులు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని వంగా గీత వెల్లడించారు. పవన్ […]
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. మహిళలు పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించి ఉన్మాదం చూపించారు.