ఎన్నికల్లో తమ ఓటును ప్రజలు ఎవరకి నచ్చిన పార్టీకి వాళ్లు వేసుకుంటారు, కొంత మంది ప్రలోభాలకు లొంగినా మెజారిటీ ప్రజలు మాత్రం ప్రభుత్వ పనితీరును విశ్లేషించుకుని మాత్రమే వాళ్లకు నచ్చిన పార్టీలకు ఓటు వేస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం పార్టీలకు, కులాలకు అతీతంగా చేసిన మంచిని దృష్టిలో పెట్టుకుని వైసీపీకి ఓటు వేసిన కన్నతల్లికి ఆమె కొడుకు మహా శాపంగా మారాడు, వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లినే హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాలో కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు ఒక దుర్మార్గుడు. వడ్డే వెంకటేశులు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరుగుతూ ఉండేవాడు ఈ నేపధ్యంలో తల్లి వడ్డే సుంకమ్మ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీకి ఓటు వేసినట్లు కొడుకుతో చెప్పగా కోపంతో ఊగిపోయి మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవకి దిగాడు. క్షణికావేశంలో కన్న తల్లి తలపై ఇనుప సుత్తితో బాది హత్య చేశాడు.
జరిగిన ఘటనకు సంభందించి సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సొంత కుటుంబంలో చిచ్చులు రేపే విధంగా చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుల మితిమీరిన రెచ్చగొట్టే ప్రసంగాల వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు.