చాలా కాలం సందిగ్దత తర్వాత చివరికి పిఠాపురం నుండి పోటీ చేస్తా అని పవన్ ప్రకటించిన అనంతరం పిఠాపురంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్మ అనుచర గణం రచ్చ తర్వాతా బాబు వర్మను పిలిచి అంతా సెట్ చేసినట్టు కనిపించి కనీసం మూడు రోజులు కాలేదు అప్పుడే పవన్ పిఠాపురం పోటీ పై మరోసారి అనుమానాన్ని వ్యక్తం చేశాడు..
వివరాల్లోకి వెళ్తే తనను బీజేపీ పెద్దలు ఎమ్మెల్యే గా వద్దు ఎంపీ గా పోటీ చేయమంటున్నారు అని ప్రకటించాడు పవన్.. అంటే ఇక పిఠాపురం నుండి పవన్ పోటీ లేనట్టే, కాకినాడ నుండి ఎంపీ గా పోటీ చేయడం ఇక లాంఛనమే
రాష్ట్రంలో వైసీపీ మరో సారి సులువు గా గెలవబోతుంది అని కేంద్ర వర్గాల వారికి సమాచారం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం లో ఎమ్మెల్యే ల సంఖ్య గురించి ఇక బీజేపీ పెద్దలు పట్టించుకునే స్థితిలో లేరు. ఈరోజు మోదీ వేసిన ట్వీట్ లో కూడా తనకు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో భారీ ఆదరణ లభించింది అనీ, ఎన్డీయే కూటమి గెలుపు సులువు అనిపిస్తున్నదని అర్థం వచ్చేలా స్థూలంగా రాసుకొచ్చారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.
దీనిబట్టి ఏపీ ని బీజేపీ సీరియస్ గా తీసుకోవడం లేదని, వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.. కాబట్టి ఈ నేపథ్యం లో పవన్ ను ఎంపీ గా పోటీ చేయించి గెలిచిన తర్వాత ఏ సహాయ మంత్రో, లేదా స్వాతంత్ర్య మంత్రి హోదా ఇచ్చి తన జనసేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేసుకునే ఉద్దేశంలో బిజెపి పెద్దలు ఉన్నట్లు సమాచారం… ఇది జరగాలి అన్నా పవన్ కళ్యాణ్ కాకినాడ లో ఎంపీ గా గెలవాలి… అదంత సులువు కానే కాదు.. చూద్దాం రాష్ట్రం లో ఇంకో పార్టీ కేంద్రమంత్రి పదవి కై విలీనం జరుగుతుందో లేదో…