జనసేన అధినేత పవన్ కళ్యాణ్సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు చిలకలూరిపేట దగ్గర బొప్పిడిలో బిజెపి, జనసేన, టిడిపిల కూటమి భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభకు విజయవాడ పశ్చిమ, పెడన జనసేన కార్యకర్తలు బాయికాట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ఓడిపోయిన అభ్యర్థులు ఇతర పార్టీలోకి వెళ్లిపోగా, పార్టీ కష్టకాలంలో నిలబడిన పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వకపోవడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా మనం బలంగా ఉన్న చోట బీజేపీకి సీటు కేటాయించడం ఏంటి అని పోతిన మహేష్ వర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిన మహేష్ కి టికెట్ కేటాయించాలని జనసేన వీర మహిళలు, కార్యకర్తలు పట్టుబట్టారు. టికెట్ ఇవ్వకపోవడంతో అలిగిన జనసేన కార్యకర్తలు ఉమ్మడి సభకి హాజరు కాలేదు. పోతిన మహేష్ ఒంటరిగానే వెళ్లారు.
పెడన టికెట్ విషయంలోను జనసేన కార్యకర్తలు పట్టువీడటం లేదు, పెడన జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ అంకెం లక్ష్మీ శ్రీనివాస్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ కేటాయించాలి అంటూ ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి పలుసార్లు విజ్ఞప్తి చేసిన తమ డిమాండ్లను పవర్ పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభకు దూరంగా ఉన్నారు. పెడన టికెట్ విషయంలో పవన్ కళ్యాణ్ పునః పరిశీలన చేసుకోవాలని పెడన జనసేన కార్యకర్తలు ఈ సందర్భంగా తెలిపారు.