వ్యవస్థలను నాశనం చేసి, ప్రైవేటుపరం చేయడానికే ఆసక్తి చూపే చంద్రబాబు తన అధికారంలో ఉండగా నష్టాలతో కునారిల్లేలా చేసిన ఏపీయస్ ఆర్టీసీ రంగం ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంటుంది. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించి, ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులకు భద్రతని ఇస్తూ జగన్ చేసిన మార్పులు వినూత్న ఫలితాలను ఇచ్చాయి.
ఫలితంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఏపీఎస్ ఆర్టీసీకి అవార్డుల పంట పండింది. వివిధ విభాగాల్లో 2022-23 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నేషనల్ బస్ ట్రాన్స్పోర్టు ఎక్సలెన్స్ విభాగంలో ఐదు అవార్డులు ఆర్టీసీకి వరించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్స్ (ఎఎస్ఆర్టీ యూ) ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనురాగ్ జైన్ చేతుల మీదుగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు అవార్డులు అందుకున్నారు.
నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టిక్కెట్ల జారీ, బస్సుల్లో డిజిటల్ టిక్కెట్ల అమలు, బస్సుల ట్రాకింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక వినియోగంతో పాటు ఏడున్నర వేల వరకు గ్రామీణ బస్సులున్న ఆర్టీసీలో అత్యధిక కేఎంపీఎల్ సాధించినందుకు మరో అవార్డు దక్కింది.
ఆర్టీసీని కేవలం ప్రయాణసాధనంగానే కాకుండా, విలక్షణంగా కార్గో, ట్రాన్సపోర్టేషన్లలో కూడా వాడొచ్చనే నిర్ణయం తీసుకోవడం… కరోనా సమయంలో ఆర్టీసీకి నష్టాల బాట పట్టకుండా ఉండేందుకు తోడ్పడింది. అంతేకాక, లాజిస్టిక్ట్స్ విభాగంలో కార్గో ద్వారా టిక్కెట్టేతర ఆదాయం కూడా కలగడంతో నేడు టికెట్టేతర ఆదాయ ఆర్జనలో లక్ష్యాల కంటే అధిక ఆర్జన, సిబ్బంది సంక్షేమంలో మరో అవార్డు ఆర్టీసీ పొందింది. ప్రభుత్వ పరం చేసాక, జగన్ సంస్థ ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా, సహజ మరణానికి రూ. ఐదు లక్షల బీమా కలిపించే ప్యాకేజీలను అమలు అయ్యేలా చూస్తున్నారు. నేడు దేశానికే ఏపీఎస్ ఆర్టీసీ నిలవడం ముదాహవం.