వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఎవరూ ప్రస్తావించవద్దని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి తరచుగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ నేత సురేష్బాబు వైఎస్ వివేకా హత్య ప్రస్తావనపై కడప కోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్, రవీంద్రనాథ్రెడ్డిని చేర్చారు. కాగా పిటిషనర్ తరుపున […]
వివేకా హత్య కేసు వ్యవహారం పై జరుగుతున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. చూసి చూసి జనాలకే విసుగొచ్చింది. అందుకే కేస్ డిటేల్స్ గురించి గానీ, పాత క్యాసెట్ మళ్లీ వినిపించి మళ్లీ మళ్లీ హింసించే ఉద్దేశం లేదు. సీదా పాయింట్ కి వస్తే:… నిన్న వివేకా హత్య ఉదంతంపై సీబీఐ సేకరించిన వీడియో లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది, రక్తపు మడుగులో ఉన్న […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తుస్తున్నాయి. అంతేకాకుండా సినిమా మాధ్యమం ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో రూపొందిన వివేకం సినిమా ఇప్పుడు వివేకా హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని బాగా ఇబ్బంది పెట్టినట్లుంది. దాంతో దస్తగిరి హైకోర్టును ఆశ్రయించాడు. వివేకానంద రెడ్డి హత్యలో పాలుపంచుకున్న దస్తగిరి వివేకం […]
నిన్న మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై, ఆ తరువాత టీడీపీతో కలిసి వివేకా కుమార్తె, సునీతా రెడ్డి, తన చెల్లెలు షర్మిల చేస్తున్న ప్రచారం పై నిప్పులు చెరిగారు . హత్య, అనంతర పరిణామాల్లో ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ సూటి ప్రశ్నలు సంధించారు. సభలో మొదట ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి అంశాల్ని ప్రస్థావించిన జగన్ […]
2019 సార్వత్రిక ఎన్నికలు ముందు మార్చి 14 తారీఖున పులివెందులలోని వైయస్ వివేకానంద రెడ్డి ఇంటిలో హత్యకు గురయ్యాడు. జమ్మలమడుగులో వైయస్ అవినాష్ రెడ్డి ప్రచార సభలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. మరుసటి రోజు ఉదయం అంటే మార్చి 15 తారీఖున ఎప్పటిలాగే వైయస్ వివేకానంద రెడ్డి పీఏ అయినా ఎంపీ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇంటి లోపల లైట్లు ఆపి ఉండడంతో వివేకానంద […]
వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి కీలక అధరాలు లభించినట్లు తెలుస్తుంది. వివేకానంద రెడ్డి రాసి ఇచ్చిన వీలునామా సీబీఐకి లభించింది. ఈ వీలునామా ప్రకారం వివేకా రెండో భార్య షేక్ షమీమ్ కి ఆస్తి వెళ్తోందనే కుట్రతోనే హత్య జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వివేకా రాసిన లెటర్ దాచిపెట్టమని చెప్పిన వివేకా అల్లుడు నరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన కీలక ఆధారాలను […]