2019 సార్వత్రిక ఎన్నికలు ముందు మార్చి 14 తారీఖున పులివెందులలోని వైయస్ వివేకానంద రెడ్డి ఇంటిలో హత్యకు గురయ్యాడు. జమ్మలమడుగులో వైయస్ అవినాష్ రెడ్డి ప్రచార సభలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. మరుసటి రోజు ఉదయం అంటే మార్చి 15 తారీఖున ఎప్పటిలాగే వైయస్ వివేకానంద రెడ్డి పీఏ అయినా ఎంపీ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇంటి లోపల లైట్లు ఆపి ఉండడంతో వివేకానంద రెడ్డి నిద్రలేచి ఉండడని బయట తను న్యూస్ పేపర్ ని చదువుకుంటూ ఉన్నానని కాసేపు తర్వాత వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మకి తాను కాల్ చేసి సార్ ఇంకా నిద్ర లేవలేదు, మీరు ఫోన్ చేసి నిద్ర లేపండి అని అడగగా రాత్రి ప్రచారంకి వెళ్లి లేటుగా వచ్చినట్లు ఉంటాడు ఇంకా కాసేపు నిద్రపోనిలే అని సౌభాగ్యమ్మ చెప్పిందని చెప్పాడు. సౌభాగ్యమ్మతో ఫోన్ మాట్లాడిన పది నిమిషాల తర్వాత వంట మనిషి లక్ష్మమ్మని ఆమె కొడుకు ప్రకాష్ తన బైక్ మీద తీసుకొచ్చాడు. అప్పటికే లేట్ కావడంతో వాచ్మెన్ రంగాన్ని వివేకం సార్ నీ నిద్రలేపమని చెప్పగా , రంగన్న నిద్రలేచి ఉత్తరం వైపు ఉన్న పార్క్ వైపు వెళ్ళాడు.
ఇంతలో సార్ పడిపోయాడు అంటూ అరుచుకుంటూ రంగన్న వచ్చాడు. మేము ఉత్తరం వైపు ఉన్నా తలుపు నుంచి తొంగి చూడగా సార్ బెడ్ రూమ్ లో గాని హాల్లో గాని లేడు కానీ రక్తపు మరకలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అప్పటికే ఉత్తరం వైపు తలుపు తెరిచి ఉంది. రక్తపు మరకలు అనుసురిస్తూ పోతే బాత్రూంలో వివేకం సారు రక్తపుమడుగులో పడి ఉన్నాడు నేను చేయి పట్టుకొని చూడగా నాడీ కట్టుకోవడం లేదు చనిపోయాడని నిర్ధారించుకున్నాను.
నేను వెంటనే సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి వివేకం సార్ రక్తపుమడుగులో పడి ఉన్న విషయాన్ని చెప్పాను. వివేకం సార్ మనకు లేరు , ఎవరు ఏదో చేశారు. తల మీద గాయంగా ఉంది ,నాకు అనుమానంగా ఉంది అని రాజశేఖర్ రెడ్డితో 47 సెకండ్లు మాట్లాడి ఫోన్ పెట్టేసాను. ఆ తర్వాత వివేకం సార్ పెద్ద బావ మరిది నర్రెడ్డి శివ ప్రకాష్ రెడ్డికి కాల్ చేశాను, కాల్ కలవలేదు. రాజశేఖర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వివేకం సార్ భార్య సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది, నేను సౌభాగ్యమ్మకి జరిగిన మొత్తాన్ని వివరించాను.
రాజశేఖర్ రెడ్డి సౌభాగ్యమ్మతో మాట్లాడిన తర్వాత ఇంట్లో వీల్ చైర్ దగ్గర ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఏమి రాసుందంటే తన మాజీ డ్రైవర్ దస్తగిరి తనను చంపినట్లు అందులో రాసి ఉంది. ఆ లెటర్ చదువుతున్న సమయంలో సౌభాగ్యమ్మ నాకు ఫోన్ చేయగా అల్లుడైన రాజశేఖర్ రెడ్డి కి ఫోను ఇవ్వమన్నాను, ఆయనతో ఫోన్ మాట్లాడుతూ లెటర్ లో రాసింది చదివి వినిపించాను. చదివి వినిపించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దాని గురించి ఎవరికీ చెప్పొద్దు అంటూ చెప్పాడు. ఇంతలోనే నేను కలుగజేసుకొని పోలీసులకి చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాను, ఏమి ఇబ్బంది అవదు అన్ని మేము చూసుకుంటాం ఆ లెటర్ జాగ్రత్తగా ఉంచమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ అందరికీ తెలిసినవే
మామ అల్లుళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉండేవి అని కృష్ణారెడ్డిని ప్రశ్నించగా దానికి సమాధానం గా పిఏ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ అల్లుడైన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద వివేకం సార్ కు మంచి అభిప్రాయం లేదు. అల్లుడు కాబట్టి తప్పేది కాదు. రాజశేఖర్ రెడ్డి మీద వివేకం సార్ తరచూ కోప్పడేవారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో అంత లోతుగా నాకు తెలిసేది కాదు, కానీ తరచుగా వివేకం సార్ రెండో భార్య అయిన షమీమ్ విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి. వివేకం సార్ రెండో పెళ్లి చేసుకోవడం ఆ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. ఇదే విషయమై ఒకరోజు వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ,కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ,పెద్ద బావమరిది శివ ప్రకాష్ రెడ్డి అందరూ కలిసి వివేకం సార్ పైన గొడవపడ్డారు. ఆ సందర్భంలో వివేకం సారు మాట్లాడుతూ రెండో భార్యతో ఒక అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పాడు, షమీమ్ కొడుకు బాధ్యతతో పాటు షమీమ్ ఇద్దరి చెల్లెలు పెళ్లిళ్లు తన బాధ్యత అని వీళ్ళు నలుగురితో కరాకండిగా చెప్పాడు. అదే సమయంలో వీరితో మాట్లాడుతూ వివేకం సార్ తన ఆస్తిలో షమీం కొడుకుకు వాటా ఉంటుందని తెలియజేశారు. అప్పటినుంచి సౌభాగ్యమ్మ వివేకం సార్ని దూరం పెట్టింది. సునీతమ్మకు వివేకం సార్ కి ఆ తర్వాత నుంచి అసలు మాటలు లేవు.
సిబీఐ దర్యాప్తు కూడా సక్రమంగా జరగడం లేదు అంటూ వివరించారు. సిబిఐ అధికారి రాంసింగ్ అప్పట్లో తనతో అబద్ధం చెప్పించాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ నేను దేనికి తలోగ్గలేదు. వివేకానంద రెడ్డి హత్య తర్వాత అందరూ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని సునీత, రాజశేఖర్ రెడ్డి పలుసార్లు నా వద్దకు వచ్చి వారి పేర్లు చెప్పమనగా నాకు అర్థమయ్యేది కాదు. నాతో అబద్ధం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారంటే దాని వెనుక వాళ్లకేదో దురుద్దేశం ఉండే ఉంటుంది, ఎవరినో కాపాడేందుకు ఏదో నిజాన్ని దాచేందుకు వాళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది.
చివరగా వివేక హత్య గురించి ఏమంటారు అని కృష్ణారెడ్డిని ప్రశ్నించగా దానికి బదులుగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జరుగుతున్నదంతా చూస్తే సునీత ,రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాష్ రెడ్డి మీదే అనుమానం కలుగుతుంది. వీళ్లే వివేకం సార్ ని హత్య చేపించి మరొకరి మీదికి నింద మోయాలని చూస్తున్నారు. ఆస్తి గొడవలే ప్రధానంగా చెప్పుకోవచ్చు. షమీమ్ ను రెండో పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. ఆస్తి వేరొకరికి పోతుందనే చేశారా అనిపిస్తుంది. ఎవరైనా నిజం చెప్పాలని కోరుకుంటారు కానీ వీళ్లు మాత్రం అబద్ధాన్ని నాచేత చెప్పించి వేరొకరిని ఇందులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్ రెడ్డి జైలుకు పోతారని కూడా సునీత నా ముందే చాలా సందర్భాల్లో అంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
వివేకం సార్ ని అంతా క్రూరంగా చంపాను అని చెప్పిన దస్తగిరిని ఎలా అప్రువర్ గా మారుస్తారు ,అతను చెప్పింది ఎలా పరిగణలోకి తీసుకుంటారు, దస్తగిరిని మేనేజ్ చేసి ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని అతనితో అలా అబద్ధాలు చెప్పిస్తున్నారు. గతంలో 500 కూడా దిక్కులేని దస్తగిరి నేడు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ పంచాయతీలు చేస్తున్నాడు, అతను చెప్పే అబద్దాలని సిబిఐ పరిగణలోకి తీసుకొని ఎలా విచారిస్తోంది అని అడిగారు, వివేకం సారు రెండో భార్యను షమీమ్ స్టేట్మెంట్ ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, ఆ వైపుగా ఎందుకు విచారణ చేపట్టలేదు అని కోరారు. సీబీఐ విచారణ సక్రమంగా జరిగి నిజమైన దోషులను శిక్షిస్తేనే వివేకం సారు ఆత్మకు శాంతి చేకూరుతుందని కృష్ణారెడ్డి తెలిపాడు.