“ముప్పయ్యేళ్ళుగా చంద్రబాబును గెలిపిస్తూనే ఉన్నారు” అని మొన్ననే సాక్షాత్తూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారే మీడియా సాక్షిగా కుప్పం ప్రజలను ఉద్దేశించి అన్నారు. మరి ముప్పయ్యేళ్ళుగా కుప్పం ప్రజల కోసం చంద్రబాబు ఏం చేసారు అని చూస్తే… కుప్పం కు కనీసం సరైన బస్టాండు కూడా లేని పరిస్థితి. జగన్ వచ్చాకే కుప్పంలో ఆకర్షణీయంగా బస్ కాంప్లెక్స్ ను నిర్మించారు. కుప్పంను మునిసిపాలిటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్ పూనుకుంటేనే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా శివారు ప్రాంతాల […]
రోజూ రోజుకి భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో త్రాగు నీరుకే కష్టం అనేలా ఉన్న పరిస్థితిలో 6300 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేలా, కుప్పం పలమనేరు రెండు నియోజకవర్గాలోని 8 మండలాలకు చెందిన 2 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చేలా 697 కోట్ల వ్యయంతో చేపట్టిన 143 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ నెల 26న బ్రాంచ్ కెనాల్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి […]
నారా గుండెల్లో కుప్పం కుటుంబం.. ఈ మాట అన్నది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి. నిజానికి నారాకు కుప్పం భయం పట్టుకుంది అనాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పరిస్థితులు కల్పించారు. సోమవారం ఆమె చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లెలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొని పైవ్యాఖ్యలు చేశారు. బాబు చంద్రగిరి నుంచి కుప్పానికి వలస వెళ్లారు. ఆయన మూడు దశాబ్దాల పాలనలో ప్రజానీకానికి చేసిందేమీ లేదు. కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. […]
పులివెందులలో నే ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి, వైసీపీ కి అభ్యర్ధులే దొరకడం లేదంటూ చంద్రబాబు కితకితలు… పులివెందులలో కూడా గెలిచేస్తాం అని 2019 ఎన్నికల సమయం లో బీరాలు పలికి చివరికి 100 ఓట్ల మెజారిటీ కూడా తగ్గించలేకపోయారు, పులివెందులలో భారీ మెజారిటీ తో గెలిచి జగన్ సీఎం అయ్యాడు… చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే గా మిగిలిపోయాడు.. ఇక కుప్పం విషయానికి వస్తే .. 1999 ఎన్నికల్లో 65,687 మెజారిటీ గెలిస్తే….. 2004 ఎన్నికల్లో 59,588 మెజారిటీ […]
జగన్ గారు హంద్రీనీవా ద్వారా కుప్పం పట్టణానికి నీరు తీసుకుని వస్తానని ఇచ్చిన హమీ నెరవేర్చారు. ఈ మేరకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగు నీరు జాలాలు తెచ్చే ఏర్పాట్లు వేగవంతం చేసి నేడు హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మ జలాలని కుప్పం నియొజకవర్గంలోకి ప్రవేశపెట్టారు. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు కరువుతో అల్లాడుతున్న కుప్పం ప్రజల సాగు త్రాగునీటి అవసరాలని ఏనాడు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలను తీసుకురావడం […]
చంద్రబాబు కుప్పంలో ఎయిర్ పోర్ట్ కట్టించి కుప్పం కూరగాయలను విమానాల్లో పంపిస్తా అంటూ చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాపంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఏడు సార్లు కుప్పంనుండి గెలిచి కుప్పానికి ఏమీ చేయని ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాలకి మధ్య అభివృద్ధిలో ఉన్న తేడాలని కొమ్మినేని శ్రీనివాసరావు సుస్పష్టంగా వెల్లడించారు. కొమ్మినేని ఏమన్నారంటే నేను కుప్పం, పులివెందుల రెండు నియోజకవర్గాలకు వెళ్లి […]
ఆయన గత 34 సంవత్సరాలుగా ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. పైగా 14 సంవత్సరాలుగా సీఎం పీఠంపై కూడా ఉన్నారు. ఇన్ని అధికారాలున్న మరో నాయకుడికి ఇదే అవకాశం దక్కి ఉంటే తన సొంత నియోజకవర్గాన్ని కళ్ళు చెదిరే రీతిలో ఇతర ప్రాంతాలు కుళ్ళుకునేలా అభివృద్ధి చేసి ఉండేవాళ్ళేమో. కానీ 34 ఏళ్ల పాటు గెలుస్తూ కూడా మరోసారి నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నాడంటే చెప్పేవాడు చంద్రబాబైతే వినేవాళ్ళు కుప్పం ప్రజలై ఉండాలి. 34 […]