నారా గుండెల్లో కుప్పం కుటుంబం.. ఈ మాట అన్నది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి. నిజానికి నారాకు కుప్పం భయం పట్టుకుంది అనాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పరిస్థితులు కల్పించారు. సోమవారం ఆమె చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లెలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొని పైవ్యాఖ్యలు చేశారు.
బాబు చంద్రగిరి నుంచి కుప్పానికి వలస వెళ్లారు. ఆయన మూడు దశాబ్దాల పాలనలో ప్రజానీకానికి చేసిందేమీ లేదు. కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. ఏదో చుట్టపు చూపుగా వెళ్లొచ్చేవారు. తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. కరువు సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. ఉపాధి కోసం స్థానికులు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిసినా స్పందించలేదు. ఇక్కడ నీటి సమస్య తీరాలంటే హంద్రీ – నీవా జలాలే మార్గమని తెలిసినా ఆ పని చేయలేదు. రోడ్ల గురించి పట్టించుకోలేదు. చివరికి 14 ఏళ్లు సీఎంగా ఉన్న నారా వారు రెవెన్యూ డివిజన్ చేయాలని జగన్కు లేఖ రాశారు. దీనిని బట్టి ఆయన తన నియోజకవర్గంపై ఏ స్థాయిలో ప్రేమ చూపించారో అర్థం చేసుకోవచ్చు.
‘నా దృష్టిలో పులివెందుల ఎంతో.. కుప్పం కూడా అంతే.. ఈ ప్రాంత ప్రజల కోసం రూ.250 కోట్లతో రిజర్వాయర్లను కట్టిస్తాం. పాలారు ప్రాజెక్టుకు న్యాయ, పర్యావరణ సమస్యలు తొలగ్గానే రూ.120 కోట్లతో పనులు చేపడతాం. కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు ఇచ్చాం. నాలుగు మండలాల అభివృద్ధికి రూ.వంద కోట్లు అడిగారు. అది కూడా ఇస్తా.’ సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంలో 2022లో కుప్పంలో తొలిసారి పర్యటించినప్పుడు చెప్పిన మాటలివి.
జగన్ చెప్పినట్లుగానే కుప్పానికి చాలా చేశారు. 55 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రూ.6.5 కోట్లతో రెడ్డిపల్లి–రామకుప్పం విద్యుత్ సబ్స్టేషన్ కట్టారు. హంద్రీ–నీవా కెనాల్ పూర్తికి చర్యలు తీసుకున్నారు. కొత్తపేట నుంచి డీకేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేశారు. రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు ఇచ్చింది జగనే. ఇక పథకాల రూపంలో వందల కోట్ల రూపాయలు ఇచ్చారు. దీంతో బాబు మోసాన్ని తెలుసుకున్న జనం కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. త్వరలో జగన్ ప్రజలకు హంద్రీ–నీవా ద్వారా నీరందిస్తారు. ఇది ఆయన చిత్తశుద్ధి.
జగన్ కుప్పానికి చేస్తున్న అభివృద్ధిని చూసి బాబు ఇన్నేళ్ల తర్వాత అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఓటమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో నారా వారు అప్పుడప్పుడూ తన నియోజకవర్గానికి వెళ్తున్నారు. ప్రజలను మభ్యపెడుతున్నారు. కుప్పం కూరగాయల్ని విమానాల్లో విదేశాలకు పంపిస్తానని పిచ్చిపిచ్చి మాటలు చెబుతున్నాడు. ఈ ప్రాంతానికి నాన్ లోకల్ అయిన బాబుకు ఇప్పుడు అక్కడ ఓడిపోతానని భయం పట్టుకుంది. అందుకే భార్యను పంపి మా గుండెల్లో మీరున్నారని సినిమా డైలాగులు చెప్పిస్తున్నాడు. ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తామని నాయకులను ప్రలోభ పెడుతున్నారు. కానీ నిజం ఏంటంటే నారా గుండెల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతికి మాత్రమే చోటు ఉంది.